Mansoor Ali Khan: ఆస్పత్రిలో మన్సూర్ అలీ ఖాన్.. విషమిచ్చారంటూ ఆరోపణ

ABN , Publish Date - Apr 19 , 2024 | 04:58 PM

కోలీవుడ్‌ నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ సడెన్‌గా అస్వస్థతకు గురై, హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మన్సూర్ అలీ ఖాన్ తనపై విష ప్రయోగం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచార అనంతరం గుడియాత్తం సంత నుంచి ఇంటికి బయలుదేరుతుండగా కొందరు పండ్ల రసం ఇచ్చారని, అది తాగిన కొద్దిసేపటికే గుండె నొప్పి మొదలైందని ఈ కాంట్రవర్సీ నటుడు చెప్పుకొచ్చారు.

Mansoor Ali Khan: ఆస్పత్రిలో మన్సూర్ అలీ ఖాన్.. విషమిచ్చారంటూ ఆరోపణ
Acot Mansoor Ali Khan

కోలీవుడ్‌ నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ (Mansoor Ali Khan) సడెన్‌గా అస్వస్థతకు గురై, హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మన్సూర్ అలీ ఖాన్ తనపై విష ప్రయోగం (Poison Attack) చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచార అనంతరం గుడియాత్తం సంత నుంచి ఇంటికి బయలుదేరుతుండగా కొందరు పండ్ల రసం ఇచ్చారని, అది తాగిన కొద్దిసేపటికే గుండె నొప్పి మొదలైందని ఈ కాంట్రవర్సీ నటుడు చెప్పుకొచ్చారు. తనకు ఎవరో జ్యూస్‌లో విషం కలిపి ఇచ్చారని, తనపై విష ప్రయోగం జరిగిందని మన్సూర్ చేసిన ఆరోపణలు.. కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. (Actor Mansoor Ali Khan Hospitalized)

*My Dear Donga: యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయ్..


అసలు విషయం ఏమిటంటే.. వేలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి మన్సూర్ అలీ ఖాన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వాస్తవానికి ఆయన ‘డెమోక్రటిక్ టైగర్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో పార్టీని స్థాపించారు కానీ.. ఆ పార్టీకి ఇంకా ఎన్నికల సంఘం గుర్తింపును ఇవ్వలేదు. దీంతో ఈ ఎన్నికలలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వేలూరు ప్రజలతో మమేకం అవుతున్న ఆయన ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం (Mansoor Ali Khan Election Campaign) నిర్వహించారు. ఈ క్రమంలో ఆయనకు సడెన్‌గా ఛాతిలో నొప్పి (Chest Pain) రావటంతో పక్కనే ఉన్న వాలంటీర్లు ఆసుపత్రికి తరలించారు. ఆయన హాస్పిటల్‌లో జాయిన్ అయి, చికిత్స తీసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.


Mansoor.jpg

ఇదిలా ఉంటే.. మన్సూర్ అలీ ఖాన్‌‌ ఈ హాస్పిటల్ డ్రామా అంతా ఎన్నికల స్టంట్‌గా కొందరు కొట్టిపారేస్తున్నారు. కారణం, వైరల్ అవుతోన్న వీడియోలో ముందుగానే అంతా స్కెచ్ చేసుకుని చిత్రీకరణ జరిపినట్లుగా ఉందని.. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఇంతకు ముందు త్రిష (Trisha) విషయంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో పాటు కొందరు సెలబ్రిటీలను టార్గెట్ చేసి.. పరువు నష్టం దావా అంటూ మన్సూర్ అలీ ఖాన్ చేసిన షో అందరికీ తెలిసిందే. అందులోనూ ఇప్పుడు ఎన్నికలు కాబట్టి.. మన్సూర్ అలీ ఖాన్ ఇలా సింపతీ డ్రామాకు తెరతీశాడనేలా కోలీవుడ్ సర్కిల్స్‌లో సైతం టాక్ వినబడుతుండటం గమనార్హం.

Updated Date - Apr 19 , 2024 | 04:58 PM