Mahesh Babu: అప్పటి వరకూ నా సినిమాలను అనువదించవద్దు..

ABN , Publish Date - Sep 12 , 2024 | 06:39 PM

మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి దర్శకత్వంలో భారీ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 'ఎస్‌ఎస్‌ఎంబీ29' (SSMB29)వర్కింగ్‌ టైటిల్‌ ప్రచారంలో ఉన్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి

మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి దర్శకత్వంలో భారీ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 'ఎస్‌ఎస్‌ఎంబీ29' (SSMB29)వర్కింగ్‌ టైటిల్‌ ప్రచారంలో ఉన్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రం గురించి అధికారింగా ఏ అప్‌డేట్‌ లేనప్పటికీ ఏదో ఒక వార్త వైరల్‌ అవుతూనే ఉంటుంది. తాజాగా ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకునే మహేష్‌ రాజమౌళి (SS Rajamouli) ప్రాజెక్ట్‌తో పాన్‌ వరల్డ్‌ ప్రేక్షకులను ఈ చిత్రంలో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాతోనేబాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. ఈ నేపథ్యంలో ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని టాక్‌ నడుస్తోంది. 'ఎస్‌ఎస్‌ఎంబీ29'  విడుదలయ్యే దాకా తన గత చిత్రాలను హిందీలోకి డబ్‌ చేసి థియేటర్‌లలో రిలీజ్‌ చేయొద్దని నిర్మాతలను కోరినట్లు సమాచారం. ఇప్పటి వరకు మహేశ్‌ నేరుగా ఏ హిందీ సినిమాలోనూ నటించలేదు. దీంతో బాలీవుడ్‌లో ఇదే తన తొలి చిత్రమవుతుందని ఆసక్తిగా ఉన్నారు. అందుకే అక్కడి ప్రేక్షకుల్ని అలరించేందుకు ప్రత్యేక శ్రద్థ తీసుకుంటున్నరట.

అయితే ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. మహేష్‌ బాబు  ఎస్‌.ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రంలో కొంత పోర్షన్‌ 18వ శతాబ్దంలో నడిచే పీరియాడిక్‌ డ్రామాగా ఉంటుందని టాక్‌. అందుకే లొకేషన్లు, నటీనటుల ఎంపిక తదితర విషయాల్లో ఆయన ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే సినిమా అప్‌డేట్స్‌ ఆలస్యమయ్యే అవకాశం ఉందని టాక్‌. 

ఈ ఏడాది చివరికి ప్రీ ప్రొడక్షన్‌ పనులు ఓ కొలిక్కి వస్తాయని చెబుతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం సెట్స్‌ మీదకెళ్తుందని తెలుస్తోంది. అప్పుడే అధికారిక ప్రకటన వస్తుందని టాక్‌.  

ఇందులో  200 కు పైగా   విభిన్న రూపాలతో కూడిన పాత్రలు కనిపిస్తాయని, ప్రత్యేక గిరిజన తెగలకు చెందినవిగా అవి ఉంటాయని సమాచారం. దీనికోసం అప్పటి  మానవుల   రూపాల స్కెచ్‌లను  సిద్థం చేయిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో వాటిని ఖరారు చేయనున్నారట.

హీరో మహేష్‌ బాబు సైతం ఈ సినిమా కోసం మల్టీపుల్‌ లుక్స్‌లో  కనిపించాల్సి ఉంటుందట. ప్రస్తుతం రాజమౌళి మహేష్‌ లుక్స్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నారట. ఈ సినిమా కోసం అటు రామోజీ ఫిల్మ్‌సిటీ, అల్యుమినియం ఫ్యాక్టరీలో సెట్స్‌ నిర్మాణం జరుగుతోంది. తదుపరి వర్క్‌షాప్‌ నిర్వాహణ ఉంటుందట.  

ఇలా ప్రీ  ప్రొడక్షన్స్‌ వర్క్‌ కోసం కావలసినంత సమయాన్ని కేటాయించాలని టీమ్‌ భావించిన తరుణంలో 2025 లోనే ఈ సినిమా చిత్రీకరణకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం జనవరి రెండో వారంలో షూటింగ్‌ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. 

Updated Date - Sep 12 , 2024 | 06:39 PM