Khushbu Sundar: సెమ్మ మాస్‌... మిస్‌ కాలేను

ABN , Publish Date - Sep 29 , 2024 | 11:16 AM

'జనతా గ్యారేజ్‌’ తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr Ntr), కొరటాల శివ (Koratala siva)కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'దేవర’. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత తారక్‌ నటించిన పాన్‌ ఇండియా చిత్రమిది.

'జనతా గ్యారేజ్‌’ తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr Ntr), కొరటాల శివ (Koratala siva)కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'దేవర’. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత తారక్‌ నటించిన పాన్‌ ఇండియా చిత్రమిది. దీనితో జాన్వీకపూర్‌ కథానాయికగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఈ నెల 27న వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌గా రిలీజ్‌ అయిన 'దేవర' బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇందులో తారక్‌ నటనను అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం మెచ్చుకుంటున్నారు. తాజాగా నటి కుష్బూ సుందర్‌ (Khushboo sunder) సినిమా చూసి తారక్‌ గురించి పోస్ట్‌ చేశారు.


సినిమా విడుదలై తర్వాత రోజు సినిమా చూస్తూ ’’ఇతనే నా హీరో, సెమ్మ మాస్‌.. దీన్ని ఎలా మిస్‌ చేయగలను, దేవరతో అతను ప్రపంచాన్ని ఆశ్చర్యపరచడం చూస్తున్నాను’ అని కుష్భూ ట్వీట్‌ చేసింది. కుష్బూ ట్వీట్‌ కు తారక్‌ బదులిస్తూ ’’ హాహా.. థాంక్యూ మేడమ్‌, దేవర మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ను నందమూరి ఫ్యాన్‌ తెగ షేర్లు చేస్తున్నారు. గతంలో కూడా కుష్భూ తారక్‌ గురించి మాట్లాడారు. "జూనియర్‌ ఎన్టీయార్‌ అంటే నాకు చాలా ఇష్టం, తారక్‌ నటన ఓ అద్భుతం" అని గతంలో ఓ ఇంటర్వ్యూ చెప్పారు.  

Updated Date - Sep 29 , 2024 | 11:21 AM