లాస్‌ ఏంజెల్స్‌ అభిమానుల సమక్షంలో ఘనంగా సత్కారం!

ABN , Publish Date - Feb 19 , 2024 | 04:22 PM

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. 'విశ్వంభర' చిత్రం ఓ షెడ్యూల్‌ పూర్తి చేసిన ఆయన విహారానికి అమెరికా వెళ్లారు. ఇటీవల భారత ప్రభుత్వం దేశంలో రెండో అత్యున్నత పురస్కారం ఆయనకు ‘పద్మ విభూషణ్‌’ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

 లాస్‌ ఏంజెల్స్‌ అభిమానుల సమక్షంలో ఘనంగా సత్కారం!


మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. 'విశ్వంభర' (Vishwambhara) చిత్రం ఓ షెడ్యూల్‌ పూర్తి చేసిన ఆయన విహారానికి అమెరికా వెళ్లారు. ఇటీవల భారత ప్రభుత్వం దేశంలో రెండో అత్యున్నత పురస్కారం ఆయనకు ‘పద్మ విభూషణ్‌’ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు. ఇప్పటికే పద్మ విభూషణ్‌ చిరంజీవిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. అంతే కాదు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ఇప్పటికీ చిరుకి అభినందనలు వెల్లువెత్తున్నాయి. 

తాజాగా లాస్‌ ఏంజిల్స్‌లో తెలుగు అభిమానులు కూడా ఘనంగా సన్మానించారు. అమెరికాలోని మెగా ఫాన్స్‌ ‘మెగా ఫెలిసిటేషన్‌ ఈవెంట్‌’ను ఆదివారం లాస్‌ ఏంజిల్స్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ‘పద్మ విభూషణ్‌’ గ్రహీత చిరంజీవిని ఘనంగా సత్కరించారు. పుష్పగుచ్ఛం ఇచ్చి.. శాలువాతో సన్మానం చేశారు. తనను సత్కరించిన అభిమానులకు మెగాస్టార్‌ ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "అవార్డు వచ్చినప్పుడు ఆనందంగా ఉంటుంది. ఉత్సహాన్ని రెట్టింపు చేస్తుంది. దీని విషయంలో నాకన్నా ఎక్కువగా అభిమానులే ఆనందిస్తున్నారు. సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఎంతో ప్రేమ చూపిస్తూ ఆదరిస్తున్నారు. మీ నుంచి వచ్చే ఈ ప్రశంసలే నాలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. ఇది కదా అసలైన అవార్డు. ఇంతకు మించిన అవార్డు ఇంకేం ఉంటుంది’’అని చిరంజీవి అన్నారు. 

Updated Date - Feb 19 , 2024 | 04:22 PM