Committee Kurrollu: ‘కమిటీ కుర్రోళ్ళు’ కలెక్షన్స్ కుమ్మేస్తున్నారు..

ABN, Publish Date - Aug 24 , 2024 | 08:29 PM

డిఫ‌రెంట్ కంటెంట్ చిత్రాల‌కు ప్రేక్ష‌కాద‌ర‌ణ ఎప్పుడూ ఉంటుంద‌ని తెలుగు ప్రేక్ష‌కులు మ‌రోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిరూపించారని అంటున్నారు ఆ చిత్ర మేకర్స్. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నానికి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వస్తున్నందుకు మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Committee Kurrollu Movie Still

డిఫ‌రెంట్ కంటెంట్ చిత్రాల‌కు ప్రేక్ష‌కాద‌ర‌ణ ఎప్పుడూ ఉంటుంద‌ని తెలుగు ప్రేక్ష‌కులు మ‌రోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu) చిత్రంతో నిరూపించారని అంటున్నారు ఆ చిత్ర మేకర్స్. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నానికి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వస్తున్నందుకు మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆడియెన్స్‌, విమ‌ర్శ‌కుల‌తో పాటు సినీ సెల‌బ్రిటీ నుంచి అభినంద‌న‌లు అందుకుంటూ.. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర జోరు చూపిస్తోంది. ఇప్ప‌టికే సినిమా అన్నీ ఏరియాస్‌లో బ్రేక్ ఈవెన్ సాధించి.. రూ.15.6 కోట్లకు పైగా క‌లెక్ష‌న్స్‌ను సాధించినట్లుగా మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.

Also Read- Chiru- Balayya: చిరుని ఆప్యాయంగా పిలిచిన బాలయ్య.. మాటిచ్చేసిన చిరు!


కంటెంట్ ఉన్నోడికి క‌టౌట్ చాలు.. అనే డైలాగ్ త‌ర‌హాలో మంచి క‌థ‌తో చేసిన సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కంతో నిహారిక అండ్ టీమ్ ‘క‌మిటీ కుర్రోళ్ళు’ సినిమాను ప్ర‌మోట్ చేస్తూ వ‌చ్చింది.. వస్తోంది. రోజు రోజుకీ ఆద‌ర‌ణ‌తో పాటు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల‌ను కూడా పెంచుకోవ‌టంలో ‘క‌మిటీ కుర్రోళ్ళు’ స‌క్సెస్ అయ్యారు. సినిమా విజ‌య‌వంతంగా మూడో వారంలోకి అడుగు పెట్టేసింది. రెండో వారం కంటే మూడో వారంలో సినిమా ప్రేక్ష‌కాద‌ర‌ణ ఇంకా బాగా పొందుతుండ‌టం సంతోషంగా ఉందని నిహారిక అండ్ టీమ్ తమ ఆనందాన్ని తెలియజేశారు. ఈ సినిమాని ఇంకా చూడని వారు.. దగ్గరలో ఉన్న థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాల్సిందిగా వారు కోరారు. (Committee Kurrollu Collections)


నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకుంటోందీ సినిమా. ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌లోనే చూసి ఆద‌రించాల‌ని శాటిలైట్ మరియు ఓటీటీ హ‌క్కుల‌ను ఇంకా ఎవ‌రికీ ఇవ్వ‌లేదని చిత్రయూనిట్ వెల్లడించింది.

Read Latest Cinema News

Updated Date - Aug 24 , 2024 | 08:30 PM