Telugu Film Industry: ఎఫ్.డి.సి. చైర్మన్ పోటీలో నట్టి కుమార్ కూడా

ABN , Publish Date - Jul 11 , 2024 | 10:30 AM

ప్రముఖ నిర్మాతలు కె ఎస్ రామారావు, ఘట్టమనేని ఆదిశేషగిరి రావులతో పాటు ఇప్పుడు ఇంకొక నిర్మాత నట్టి కుమార్ పేరు కూడా ఎఫ్.డి.సి. చైర్మన్ పోటీలో వున్నారని తెలుస్తోంది. పరిశ్రమలో తెలుగు దేశం పార్టీ తరపున గట్టిగా తన గళం వినిపించిన వారిలో నట్టి కుమార్ ముందున్నారు. అందుకని నట్టి కుమార్ కూడా పోటీలో వున్నారని తెలుస్తోంది, పైగా నట్టి కుమార్ కి ఎవరి సపోర్ట్ ఉందొ తెలుసా...

Producer Natti Kumar

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం పైరవీలు ఇప్పుడు జోరందుకున్నాయి. ఒక పక్క ప్రముఖ నిర్మాత కె ఎస్ రామారావు తనవంతు ప్రయత్నాలు తాను చేసుకుంటూ వెళుతున్నారు. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. అంతకు ముందు కొన్ని రోజుల క్రితం మెగా బ్రదర్ నాగబాబుని కూడా కలిశారు. ఇవన్నీ మర్యాద పూర్వకంగా అని చెపుతున్నా, ఆ కలియక వెనకాల తన కోరికని కూడా వాళ్ళ ముందు వెళ్లబుచ్చారు అని కూడా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని కూడా రామారావు కలిసినట్టుగా సమాచారాం. (Producer Natti Kumar is also in the race for Andhra Pradesh Film Development Corporation Chairman post)

ఇదిలా ఉంటే ఘట్టమనేని ఆదిశేషగిరి రావుకి ఈసారి తెలుగు దేశం కోసం పనిచేశారు, అతనికి ఏదైనా పదవి ఇచ్చి గౌరవించాలని అనుకుంటున్నారు. అందుకోసమని అతన్ని ఎఫ్.డి.సి. చైర్మన్ గా నియమించవచ్చు అనే వార్తలు కూడా పరిశ్రమలో వస్తున్నాయి. అయితే ఆదిశేషగిరి రావు ఎప్పుడూ ప్రయత్నాలు చెయ్యరు, తనకి పదవి ఇస్తాను అంటే వద్దనకుండా చేస్తారు. దానికితోడు అతను వివాదం లేని వ్యక్తి కూడా అవటంతో అతనికి కూడా ఛాన్స్ వుంది అంటున్నారు. (Natti Kumar has direct contact with Nara Lokesh, so he is confident that he gets the post, says a source)

nattikumaryatra.jpg

ఈ ఇద్దరూ కాకుండా ఇప్పుడు అనూహ్యంగా మూడో వ్యక్తి పేరు వినిపిస్తోంది. అతను మరెవరో కాదు, ప్రముఖ నిర్మాత నట్టి కుమార్. ఈమధ్య కాలంలో తెలుగు దేశం పార్టీ తరపున తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తన గళం గట్టిగా వినిపించిన వ్యక్తి ఎవరైనా వున్నారు అంటే అది నట్టి కుమార్ అని చెప్పొచ్చు. వైస్సార్సీపీ పార్టీని ఎండగడుతూ, తెలుగు దేశం పార్టీకి సపోర్ట్ గా ఎన్నో ప్రెస్ మీట్ లు పెట్టడమే కాకుండా, రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకులు చంద్రబాబు, నారా లోకేష్ లపై వ్యంగ్యంగా తీసిన సినిమాలను న్యాయపరంగా అడ్డుకున్నారు కూడా. అందుకని ఇప్పుడు నట్టి కుమార్ కూడా ఈ చైర్మన్ పదవి కోసం తన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది.

నట్టి కుమార్ కి నేరుగా నారా లోకేష్ తో మాట్లాడుతూ ఉంటారని, అతనికి లోకేష్ ఆశీస్సులు ఉన్నాయని, అందుకని అది తనకి కచ్చితంగా వస్తుందని నట్టి కుమార్ చాలా ధీమాగా వున్నారని ఒక వార్త. అయితే తెలుగు దేశం పార్టీ, మిత్ర పక్షమైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో కలిపి ఈ చైర్మన్ పదవి ఎవరికిస్తే బాగుంటుంది అనే విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

Updated Date - Jul 11 , 2024 | 10:30 AM