Balayya-Venky: వెంకీ మామ సినిమా సెట్స్‌లో ‘భగవంత్ కేసరి’ సందడి

ABN, Publish Date - Sep 21 , 2024 | 11:08 AM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటసింహం బాలయ్య, విక్టరీ వెంకీల స్నేహబంధం గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వెంకటేష్ బ్లాక్‌బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా సెట్స్‌లో బాలయ్య సందడి చేశారు. వెంకీ సినిమా సెట్స్‌లో బాలయ్య సందడి చేసిన పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Balayya at VenkyAnil3 Sets

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం చేస్తున్న సినిమా సెట్స్‌లో ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) బాలయ్య సందడి చేశారు. బాలయ్యతో ‘భగవంత్ కేసరి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి చేస్తున్న చిత్రం #వెంకీఅనిల్3. అందుకే ‘భగవంత్ కేసరి’ సందడి చేశారని పేర్కొనడం జరిగింది. ఇక మ్యాటర్‌లోకి వస్తే.. విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi), శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ల సెన్సేషనల్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న క్రేజీ ఎంటర్‌టైనర్ #వెంకీఅనిల్3. ఇటీవల పొల్లాచ్చిలో లెన్తీ, క్రూసియల్ షెడ్యూల్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని RFCలో న్యూ షెడ్యూల్‌ ప్రారంభించుకుంది. వెంకటేష్‌తో పాటు ప్రముఖ నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు.

Also Read- Tirupati Controversy: ల‌డ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ కౌంటర్

తాజాగా ఈ సెట్స్‌‌లోకి ప్రత్యేక అతిథి వచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. RFCలో జరుగుతున్న లేటెస్ట్ షెడ్యూల్‌లో నటసింహం నందమూరి బాలకృష్ణ (Natasimham Nandamuri Balakrishna) #వెంకీఅనిల్3 సెట్స్‌‌లో సందడి చేశారు. ఈ ఆన్-లొకేషన్ స్టిల్స్‌లో బాలకృష్ణ, వెంకటేష్, అనిల్ రావిపూడి మధ్య సోదరభావం చూడటం డిలైట్ ఫుల్‌గా వుంది. బాలయ్య రాకతో టీం చాలా థ్రిల్‌ అయ్యింది. బాలకృష్ణ, వెంకటేష్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి NBK ఆల్-టైమ్ హిట్ ‘భగవంత్ కేసరి’ని రూపొందించారు. ఈ మూవీ ఇటీవల SIIMAలో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం వెంకీమామ సెట్స్‌లో బాలయ్య ఉన్న పిక్స్ వైరల్ అవుతున్నాయి.


వెంకీఅనిల్3 చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్‌గా కనిపించనుంది. ఈ ట్రై యాంగిల్ క్రైమ్ డ్రామాని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనింగ్, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ కో -రైటర్స్. వి వెంకట్ యాక్షన్ డైరెక్టర్. ఈ సినిమాని 2025 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Also Read- ANR100: ఏఎన్నార్‌ను స్మరించుకున్న చిరు, బాలయ్య

Also Read- Jani Master: నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్.. రిమాండ్ రిపోర్ట్ ఇదే

Read Latest Cinema News

Updated Date - Sep 21 , 2024 | 11:08 AM