Sobhita Dhulipala: పరిచయం ఎలా మొదలైనా.. హృదయాలు కలిసిపోయాయ్! శోభిత పోస్ట్ వైరల్

ABN, Publish Date - Aug 10 , 2024 | 08:38 AM

అక్కినేని హీరో నాగ చైతన్యతో పెళ్లికి ముస్తాబవుతోంది గ్లామర్ క్వీన్ శోభిత ధూళిపాళ. సమంతతో విడాకుల అనంతరం నాగ చైతన్య లైఫ్‌లోకి శోభిత ఎంటరైందనే వార్తలు వినబడుతూనే ఉన్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ చైతూతో నిశ్చితార్థం కూడా ముగించింది శోభిత. చైతూతో నిశ్చితార్థం అనంతరం సోషల్ మీడియా వేదికగా ఆమె రియాక్ట్ అవుతూ.. నిశ్చితార్థపు ఫొటోలను షేర్ చేసింది.

Sobhita Dhulipala and Naga Chaitanya

అక్కినేని హీరో నాగ చైతన్య (Naga Chaitanya)తో పెళ్లికి ముస్తాబవుతోంది గ్లామర్ క్వీన్ శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala). సమంత (Samantha)తో విడాకుల అనంతరం నాగ చైతన్య లైఫ్‌లోకి శోభిత ఎంటరైందనే వార్తలు వినబడుతూనే ఉన్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ చైతూతో నిశ్చితార్థం కూడా ముగించింది శోభిత. చైతూ, శోభితల నిశ్చితార్థ (Naga Chaitanya and Sobhita Engagement) విషయాన్ని కింగ్ నాగార్జున రివీల్ చేస్తూ.. సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని తెలియజేశారు. ఈ నిశ్చితార్థం విషయమై నాగార్జున మాత్రమే మొదట స్పందించారు. అనంతరం శోభిత ధూళిపాళ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని షేర్ చేసుకుంది. శోభిత పోస్ట్‌నే నాగ చైతన్య కూడా రీ పోస్ట్ చేశారు.

Also Read- NTR: ఎన్టీఆర్ పేరుతో మరో వారసుడు.. ఫ్యాన్స్‌లో కన్ఫ్యూజన్

చైతూతో నిశ్చితార్థం అనంతరం నటి శోభిత ఫస్ట్ రియాక్షన్ ఏమిటంటే.. ‘‘మా అమ్మ, నాన్నలు నీకు ఏమైనా అయి ఉండవచ్చు. వారితో నీ బంధం ఏదైనా కావచ్చు.. మన పరిచయం ఎలా మొదలైనప్పటికీ.. మన హృదయాలు ప్రేమతో నిండిపోయాయి’’ అంటూ ఎర్రటి భూమి, వర్షం కాంబినేషన్‌లా అనే క్యాప్షన్‌తో చైతూతో ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది (Sobhita Dhulipala First Post after Engagement). ఈ పోస్ట్‌కు పలువురు సెలబ్రిటీలు కామెంట్స్ చేయడం విశేషం. మలైకా అరోరా, ఖుష్బు, డయానా పెంటీ, దియా మీర్జా, ఎల్లి అవ్రామ్ వంటి వారంతా శోభితకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, చైతూ, శోభితల నిశ్చితార్థం గురువారం ఉదయం 9:42 నిమిషాలకు వైభవంగా జరిగినట్లుగా తెలుపుతూ కింగ్ నాగార్జున సోషల్‌ మీడియా వేదికగా ఫొటోలు షేర్‌ చేశారు. ఈ ఫొటోలు వచ్చినప్పటి నుంచి వారిపై వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.


శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala).. తెలుగు వారికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగచైతన్యతో నిశ్చితార్థం అనంతరం అంతా ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. ఆమె ఆంధ్రప్రదేశ్ తెనాలిలో జన్మించింది. బాల్యం, విద్యాభ్యాసం అంతా విశాఖపట్టణంలోనే. ఆ తర్వాత ముంబైకి షిఫ్ట్ అయిన ఈ భామ అక్కడ ‘లా’ చేసింది. ఆ సమయంలోనే కూచిపూడి, భరతనాట్యం వంటి కళలలో ప్రావీణ్యం సంపాదించింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా కిరీటం గెలుచుకుని వార్తలలో నిలిచింది. అప్పటి నుంచి ఏదో రకంగా ఆమె పేరు వినబడుతూనే ఉంది. పలు హిందీ సినిమాలతో పాటు.. ‘గూఢచారి’, ‘మేజర్’, ‘పొన్నియిన్ సెల్వన్ 1,2’ చిత్రాలలో నటించి నటిగానూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. కొన్నాళ్లుగా నాగచైతన్యతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నట్లుగా ఆమెపై వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కట్ చేస్తే.. ఇప్పుడు నాగచైతన్యతో నిశ్చితార్థం ముగించుకుని త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమైంది.

Read Latest Cinema News

Updated Date - Aug 10 , 2024 | 08:52 AM