మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Latest Update on Vishwambhara: 'విశ్వంభర' పోరాటంతో మళ్ళీ మొదలైంది

ABN, Publish Date - May 27 , 2024 | 04:04 PM

చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు ప్రారంభం అయింది. అన్నపూర్ణ సెవెన్ ఎకరాస్ స్టూడియో లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టుగా తెలిసింది.

Vishwambhara fresh schedule started

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోసియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర' చిత్రీకరణ మళ్ళీ ఇంకో షెడ్యూల్ మొదలైంది. ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఒక సెట్ లో ఈ చిత్రీకరణ మొదలుపెట్టారు. మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష ప్రధాన కథానాయకురాలిగా నటిస్తుండగా, ఇంకా అషిక రంగనాథ్, ఈషా చావ్లా, సురభి, మీనాక్షి చౌదరి లు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనపడతారని తెలుస్తోంది.

ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ కి చెందిన కునాల్ కపూర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రముఖ క్యారెక్టర్ నటుడు రావు రమేష్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య భూమికను పోషిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదలవుతుందని ముందుగానే ప్రకటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. చాలా సంవత్సరాల తరువాత కీరవాణి, చిరంజీవి చిత్రానికి పని చేస్తున్నారు.

ప్రస్తుతం చిరంజీవిపై పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో చిరంజీవితో పాటు, మరికొందరు నటీనటులు పాల్గొన్నారని కూడా తెలుస్తోంది. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా చాలా అవసరం అని, అవి కొన్ని ముందుగానే తయారు చేసుకున్నారని, వచ్చే జనవరిలో సంక్రాంతి పండగనాడు ఈ చిత్రం ద్వారా చిరంజీవి మరోసారి సంక్రాంతి విజేతగా నిలుస్తారని ఈ చిత్ర నిర్వాహకులు ప్రఘాడ విశ్వాసం.

మల్లిడి వశిష్ట ఇంతకు ముందు 'బింబిసార' అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు, అదే అతని మొదటి సినిమా దర్శకుడిగా. ఇప్పుడు రెండో సినిమాతో ఏకంగా మెగాస్టార్ ని దర్శకత్వం వహించే అవకాశం చేజిక్కించుకున్నాడు వశిష్ట. 'బింబిసార' సినిమా కూడా ఒక సోషియో ఫాంటసీ సినిమా అవటం ఆసక్తికరం.

Updated Date - May 27 , 2024 | 04:04 PM