Kalinga: ‘కళింగ’ పెద్ద హిట్ అవ్వాలంటోన్న బీజేపీ ఎంపీ

ABN, Publish Date - Sep 11 , 2024 | 09:23 PM

‘కిరోసిన్’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు ఇప్పుడు ‘కళింగ’ సినిమాతో హీరో మరియు దర్శకుడిగా తన సత్తా చాటబోతున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేటైంది. సెప్టెంబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.

Kalinga Pre Release Event

‘కిరోసిన్’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు ఇప్పుడు ‘కళింగ’ (Kalinga) సినిమాతో హీరో మరియు దర్శకుడిగా తన సత్తా చాటబోతున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేటైంది. టీజర్, పోస్టర్‌లు, గ్లింప్స్, సాంగ్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేయగా.. సెప్టెంబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేత, ఎంపీ రఘునందన్ రావు (BJP MP Raghunandan Rao) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Also Read- Devara Trailer: దేవర.. మరో ఆచార్య! నెట్టింట రచ్చ ర‌చ్చ‌

ఈ సందర్భంగా బీజేపీ నేత, ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. ‘‘ఎవరు ఎంత బిజీగా ఉన్నా.. రోజంతా ఉన్న అలసటను తీర్చుకోవడానికి సినిమాలు చూడటం అనేది మన కల్చర్‌లో భాగమైంది. కరోనా తరువాత అందరూ ఓటీటీకి అలవాటు పడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా ప్రయోగాలు వస్తున్నాయి. చిన్న చిత్రాలు పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. టీజర్, ట్రైలర్ చూస్తే భయపెట్టించేలా ఈ సినిమా ఉండబోతుందని అర్థమవుతోంది. ఈ మధ్య వస్తోన్న చిన్న సినిమాలు ఎలా అయితే సక్సెస్ అవుతున్నాయో.. అలానే ఈ మూవీ కూడా భారీ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను తీసిన ధృవ, నిర్మాతలకు మంచి లాభాలను రావాలని కోరుకుంటూ.. టీమ్ అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నాను’’ అని అన్నారు. నటుడు తిరువీర్ మాట్లాడుతూ.. కథ రాసి.. డైరెక్టర్ చేసి.. నటించడం అంటే మామూలు విషయం కాదు. ఘాజి సినిమా చేసినప్పుడు మేం ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్లం. కిరోసిన్ కథను రాసి, దర్శకత్వం చేసి నిర్మాతకు లాభాల్ని తీసుకొచ్చి పెట్టాడు. ‘కళింగ’ టీజర్ చూసి భయపడ్డాను. తన బాటను తానే నిర్మించుకున్నాడు. కళింగ మూవీని ఐదు వందలకు పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. మా అందరికీ ధృవ స్పూర్తి. సెప్టెంబర్ 13న వస్తోన్న ఈ సినిమాతో మా వాడికి మరింత పేరు, డబ్బులు రావాలని కోరుకుంటున్నానని అన్నారు.


ధృవ వాయు (Dhruva Vaayu) మాట్లాడుతూ.. ‘‘మా కార్యక్రమానికి వచ్చిన బీజేపీ నేత రఘునందన్ రావు, నా ఫ్రెండ్ తిరువీర్‌కు థాంక్స్. నేను రాసిన కథకు.. యాకూబ్ గారు మంచి డైలాగ్స్ ఇచ్చారు. కెమెరామెన్ అక్షయ్ పగలూ, రాత్రి అన్న తేడా లేకుండా నాతో పాటు పని చేశారు. ఎడిటర్ నరేష్ సినిమాను అద్భుతంగా మలిచాడు. విజువల్స్ బాగా వచ్చాయి.. వాటికి తగ్గ ఆర్ఆర్ కావాలి. విశ్వ శేఖర ఆర్ఆర్‌తో సినిమా మరో స్థాయికి వెళ్లింది. మంచి పాటలు ఇచ్చిన లిరిసిస్ట్‌కు థాంక్స్. ప్రీతి సుందర్ ఇందులో తన డ్రీమ్ రోల్ పోషించారు. నా డైరెక్షన్ టీం సపోర్ట్ వల్లే ఈ సినిమాను ఇంత బాగా తీయగలిగాను. సంజయ్ నటనను చూసి అంతా షాక్ అవుతారు. ఇకపై పెద్ద చిత్రాల్లో విలన్‌గా, హీరోగా కనిపిస్తాడు. ప్రగ్యా నయన్ తన పాత్రకు పర్‌ఫెక్ట్‌గా సెట్ అయింది. ఈ చిత్రం తరువాత చాలా పెద్ద ఆఫర్లు వస్తాయి. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూసిన చాలా మంది కాంతారనా, విరూపాక్షనా?.. మంగళవారంలా ఉంటుందా? అని అడుగుతున్నారు. కానీ ఇదొక కొత్త కాన్సెప్ట్. సెప్టెంబర్ 13న థియేటర్లలోకి వస్తోన్న ఈ సినిమా ప్రేక్షకులకి చాలా కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది’’ అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత దీప్తి కొండవీటి, నిర్మాత పృథ్వీ యాదవ్, హీరోయిన్ ప్రగ్యా నయన్, ప్రీతి సుందర్, బలగం సంజయ్ వంటి వారు మాట్లాడుతూ.. సినిమాను అందరూ థియేటర్లలో చూసి సక్సెస్ చేయాలని కోరారు.

Read Latest Cinema News

Updated Date - Sep 11 , 2024 | 09:23 PM