Madha Gaja Raja: విశాల్ పాడిన ‘మై డియర్ లవరు’ సాంగ్ విన్నారా..
ABN, Publish Date - Jan 30 , 2025 | 06:01 PM
Madha Gaja Raja: విశాల్, వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న చిత్రం ‘మదగజరాజ’. ఈ చిత్రం 11 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చి, సెన్సేషనల్ సక్సెస్ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ నుండి హీరో విశాల్ స్వయంగా పాడిన ‘మై డియర్ లవరు’ అనే లిరికల్ సాంగ్ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నా ఈ సాంగ్పై మీరు ఓ లుక్కేయాల్సిందే.
హీరో విశాల్ లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ ‘మదగజరాజ’. సుందర్.సి దర్శకత్వంలో జెమినీ ఫిలిం సర్క్యూట్ నిర్మాణంలో సంక్రాంతి సందర్భంగా తమిళ్లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. కోలీవుడ్లో రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసి, సంక్రాంతికి విడుదలైన తమిళ సినిమాలన్నింటిలో నంబర్ వన్ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఇప్పటికీ భారీ వసూళ్లతో విజయవంతంగా దూసుకెళుతున్న ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం జనవరి 31న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ని టాలీవుడ్లోనూ నిర్వహిస్తున్నారు. సత్య కృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం తెలుగులో విడుదలవుతోంది.
Also Read- Bad Girl: సమాజంలో కులం ఉంది కాబట్టే సినిమాల్లో కులం
Also Read- Spirit: రెబల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. స్పిరిట్ షూటింగ్ అప్పుడే
Also Read- Kangana Ranaut: కాజోల్, దీపికా ముద్దు.. మేమంటే చేదు
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Jan 30 , 2025 | 06:08 PM