పొట్టి శ్రీరాములు తర్వాత తెలుగువారు ఒక ప్రభంజనంలా వెలుగెత్తడానికి కారణం ఎన్టీఆర్.. ఇప్పుడంతా పాన్ ఇండియా అని ప్రగల్భాలు పలుకుతున్నారు కానీ, ఆయన ఆరో సినిమా పాతాళ భైరవి ఆ రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో 175 రోజులు ఆడింది. ఆయన జీవితం అంతా తెలుగువారికి అంకితం చేసిన మహానుభావుడని అన్నారు ప్రసన్నకుమార్. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులతో కలిసి ఆయన నివాళులు అర్పించారు.