హ్యాకింగ్ మోసాలపై...
ABN, Publish Date - Mar 23 , 2025 | 05:02 AM
ప్రపంచాన్ని వణికిస్తున్న హ్యాకింగ్ మోసాలపై నూతన దర్శకద్వయం నరేశ్ దోనే, మణివరన్ ఓటీటీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రావూరి సురేశ్ బాబు నిర్మాత...
ప్రపంచాన్ని వణికిస్తున్న హ్యాకింగ్ మోసాలపై నూతన దర్శకద్వయం నరేశ్ దోనే, మణివరన్ ఓటీటీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రావూరి సురేశ్ బాబు నిర్మాత. ఈ సందర్భంగా తెనాలిలో జరిగిన విలేకరుల సమావేశంలో ‘మా-ఏపీ’ వ్యవస్థాపక అధ్యక్షులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా చిత్ర విశేషాలను పంచుకున్నారు. దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసులకు హ్యాకింగ్ మోసాలు సవాలుగా మారినందువల్లనే ఈ నూతన కథాంశాన్ని ఎంపిక చేసుకున్నామని చెప్పారు. ఈ ఓటీటీ చిత్రాన్ని తమిళం, కన్నడ, హిందీ భాషల్లోకి డబ్బింగ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చిత్ర దర్శకులు నరేశ్ దోనే, మణివరన్ మాట్లాడుతూ ‘మనకు తెలియకుండానే మన బ్యాంక్ అకౌంట్ హ్యాకింగ్కు గురై డబ్బు పోగొట్టుకోవడం ఈ చిత్ర ప్రధాన కథాంశం’ అని తెలిపారు.