B Siva Prasad: ఆర్టిస్టుల మొహాలు కనిపించడం లేదే అన్న భావన కలగదు
ABN, Publish Date - Mar 06 , 2025 | 06:14 PM
మొహాలు చూపించకుండా సినిమాను తీయడం అనేది ఇదివరకు వరల్డ్ వైడ్గా ఎవ్వరూ సాహసం చేయని ఓ జానర్. ఇలా ఆర్టిస్టుల్ని చూపించకుండా, అసలు ఎవ్వరూ కనిపించకుండా సినిమాను చూపించడం మామూలు విషయం కాదు
మొహాలు చూపించకుండా సినిమాను తీయడం అనేది ఇదివరకు వరల్డ్ వైడ్గా ఎవ్వరూ సాహసం చేయని ఓ జానర్. ఇలా ఆర్టిస్టుల్ని చూపించకుండా, అసలు ఎవ్వరూ కనిపించకుండా సినిమాను చూపించడం మామూలు విషయం కాదు. కానీ అలాంటి ఓ విభిన్న ప్రయత్నం చేస్తూ తీసిన చిత్రమే ‘రా రాజా’ (Raa Raja). పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం ‘రా రాజా’. మార్చి 7న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత బి.శివ ప్రసాద్ (B Siva Prasad) మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే..
"మాతృ సినిమాతో నిర్మాతగా మారాను. అయితే ఆ సినిమా టైంలోనే నాకు ఈ ‘రా రాజా’ ఆలోచన వచ్చింది. అలా నేనే నిర్మాతగా, దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించాను. ప్రస్తుతం ఆడియెన్స్ ఎవ్వరూ కూడా హీరో హీరోయిన్ల పేర్లు, మొహాలు చూసి సినిమాలకు రావడం లేదు. ట్రెండ్ మారింది. కథ నచ్చితే, కంటెంట్ బాగుంటేనే మూవీని చూస్తున్నారు. అలా ఓ కంటెంట్ బేస్డ్, కథా ప్రాథాన్యమున్న చిత్రాన్ని తీయాలని అనుకున్నాను. అందుకే ఈ ‘రా రాజా’ తీసా. ఇందులో నటీనటులు ఎవ్వరూ కనిపించకపోయినా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ను ఆడియెన్స్ ఫీల్ అవుతారు. లవ్, కామెడీ, హారర్ ఇలా ప్రతీ ఒక్కటీ ఇందులో ఉంటుంది. ఆద్యంతం అలరించేలా, అందరినీ చివరి వరకు ఎంగేజ్ చేసేలా ఉంటుంది. సినిమాకి టెక్నికల్ టీం బలం. కెమెరామెన్ రాహుల్ శ్రీ వాత్సవ్ వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. శేఖర్ చంద్ర సంగీతం సినిమాకు మరో బలం. బీజీఎం సినిమాకు హైలైట్ అవుతుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తరువాత అందరూ ఆయన గురించి కచ్చితంగా మాట్లాడుకుంటారు. ఏ ఒక్కరినీ ఈ సినిమా నిరాశపరచదు. ఆర్టిస్టుల మొహాలు కనిపించడం లేదే? అనే భావన మాత్రం కలగదు. చివరి వరకు ఎంగేజ్ చేసేలా ఉంటుంది. మేం చేసిన ఈ ప్రయోగాన్ని అందరూ ఆదరించండి" అని అన్నారు.