Ground Zero: గ్రేట్ హిస్టారిక్ మూమెంట్...
ABN, Publish Date - Apr 15 , 2025 | 06:31 PM
కశ్మీర్ లో హిస్టారిక్ మూమెంట్ మొదలుకాబోతోంది. 38 ఏళ్ల తర్వాత శ్రీనగర్లో గ్రౌండ్ జీరో సినిమా ప్రీమియర్ షో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 18న శ్రీనగర్లో ప్రదర్శించబోతుండటం ఆసక్తిగా మారింది.
జమ్మూ కశ్మీర్ ( Jammu kashmir )లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అక్కడ సినిమా విడుదల చేయడం సవాల్తో కూడుకున్న పని. అందులోనూ శ్రీనగర్లో అంటే పెద్ద టాస్కే. కానీ ఆ అసాధ్యం సుసాధ్యం కాబోతోంది. 38 ఏళ్ల తర్వాత శ్రీనగర్లో గ్రౌండ్ జీరో (Ground Zero ) అనే సినిమాతో ఓ హిస్టారిక్ మూమెంట్ (Historic Moment) మొదలుకాబోతోంది. ఇండియన్ ఆర్మీ, బీఎస్ఎఫ్ హీరోలకు డెడికేట్ చేస్తూ ఈ సినిమా ప్రీమియర్ ఏప్రిల్ 18న శ్రీనగర్లో ప్రదర్శించబోతుండటం ఆసక్తిగా మారింది.. రెడ్ కార్పెట్ వేసి గ్రాండ్గా సెలబ్రేట్ చేయలేకపోయినా, ఈ ఈవెంట్ దేశవ్యాప్త హైప్ క్రియేట్ చేస్తోంది.
గ్రౌండ్ జీరో సినిమా.. 2001 పార్లమెంట్ దాడి తర్వాత బీఎస్ఎఫ్ ఆఫీసర్ నరేంద్ర నాథ్ ధర్ దూబే నడిపిన స్పెషల్ ఆపరేషన్ ఆధారంగా రూపొందింది. ఈ ఆపరేషన్లో దాడి సూత్రధారి ఘాజీ బాబాను అంతమొందించారు. రియల్ లైఫ్ ఈవెంట్స్తో పాటు కొన్ని కల్పిత సన్నివేశాలను జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. ఏప్రిల్ 25న దేశవ్యాప్తంగా విడుదల అవుతుండగా.. ముందుగానే శ్రీనగర్లో ఈ స్పెషల్ స్క్రీనింగ్తో బజ్ క్రియేట్ చేయబోతున్నారు.
ఈ ప్రీమియర్కి ఆర్మీ బిగ్విగ్స్తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని టాక్. మొదట ఈ ప్రాజెక్ట్లో సల్మాన్ ఖాన్(Salman Khan )ని హీరోగా తీసుకోవాలని ప్లాన్ చేశారు, కానీ అతను కిసీ కా భాయ్ కిసీ కి జాన్ , సికందర్ సినిమాలతో బిజీగా ఉండటంతో, రెండేళ్లు వెయిట్ చేయమనడంతో టీమ్ ఇమ్రాన్ హస్మీ (Emraan Hashmi )ని సంప్రదించింది. దూబే రోల్లో ఇమ్రాన్ రక్తి కట్టించాడని చెబుతున్నారు. శ్రీనగర్లో ఈ సినిమాను రిలీజ్ చేయడమంటే స్క్రీనింగ్ మాత్రమే కాదు, దేశ రక్షణ కోసం పోరాడే హీరోలకు ఓ నివాళి అని చెప్పొచ్చు.