Raj Tarun Controversy: కాంట్రవర్సీ ఏమైనా సినిమాకి హెల్ప్ అవుతుందా? మిగతా ప్రచారాలకు వస్తారా?

ABN, Publish Date - Jul 13 , 2024 | 02:38 PM

'తిరగబడరా సామీ' సినిమా ఆగస్టు 2న విడుదలవుతుంది అని ఆ చిత్ర నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. అందులో నటించిన జంట రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా ఇప్పుడు పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు, అయితే వాళ్ళు ఈ సినిమా మిగతా ప్రచారాల్లో పాల్గొంటారా లేదా అనే విషయంపై ఒక చర్చ నడుస్తోంది.

Tiaragabadara Saami team

రాజ్ తరుణ్, దర్శకుడు ఎఎస్ రవికుమార్ చౌదరి కాంబినేషన్ లో వస్తున్న 'తిరగబడరసామీ' విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజ్ తరుణ్ సరసన వివాదాస్పద నటి మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. మల్కాపురం శివకుమార్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రం ప్రచార వీడియోలు ఈమధ్యనే విడుదలయ్యాయి, సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి కూడా.

అయితే ఇక్కడ ఒక ప్రశ్న అందరి మదిలో ఉత్పన్నం అవుతోంది. రాజ్ తరుణ్ ప్రియురాలు అని చెప్పుకుంటున్న లావణ్య కొన్ని రోజుల క్రితం నార్సింగి పోలీసు స్టేషన్ లో రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు కూడా రాజ్ తరుణ్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు కూడా చేశారు. ఈ కేసు ఇప్పుడు దర్యాప్తులో వుంది. లావణ్య తన ఫిర్యాదులో, రాజ్ తరుణ్ కి ఈ 'తిరగబడరా సామీ' సినిమాలో నటించిన కథానాయకురాలు మాల్వి మల్హోత్రాకు మధ్య సంబంధం వుంది అని ఆరోపించింది. ఆధారాలు కూడా పోలీసులకి ఇచ్చినట్టుగా తెలిసింది.

అయితే ఇదే సమయంలో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రాలు నటించిన ఈ సినిమాని ఆగస్ట్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి నిర్వాహకులు సన్నద్ధం అయ్యారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా ఈ ఇద్దరూ ఇప్పుడు వివాదంలో వున్నారు కాబట్టి, ఆ వివాదం ఈ సినిమాకి ఏమైనా ప్లస్ అవుతుందా, లేక మైనస్ అవుతుందా అని ఒక చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో ఇంకో కథానాయకురాలి మన్నారా చోప్రా కూడా వుంది.

దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి చాలా సంవత్సరాల తరువాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇంతకు ముందు అతను 'యజ్ఞం', 'వీరభద్ర', 'ఆటాడిస్తా', 'పిల్లా నువ్వులేని జీవితం' లాంటి సినిమాలు చేశారు. ఇప్పుడు చాలా విరామం తరువాత 'తిరగబడరా సామీ' అనే ఈ సినిమాకి దర్శకత్వం వహించి ఆగస్టు 2వ తేదీన వస్తున్నారు. ఈ సినిమా విజయం రవికుమార్ కి చాలా కీలకం అనే చెప్పాలి. కానీ ఈ సినిమాలో నటించిన జంట మాత్రం వివాదాల్లో ఇరుక్కున్నారు, మరి వాళ్ళు ఇప్పుడు ప్రచారాలకు వస్తారా, లేక ఇంటికే పరిమితం అయిపోతారా అనే విషయం వేచి చూడాలి.

Updated Date - Jul 13 , 2024 | 02:38 PM