Sai Durga Tej: మామయ్య గెలిచాడు.. మొక్కు తీర్చుకోవడానికి వచ్చా..

ABN , Publish Date - Jun 15 , 2024 | 01:37 PM

మామయ్య పవన్ కళ్యాణ్ గెలిస్తే.. కాలినడకన తిరుమలకు వస్తానని మొక్కుకున్న మేనల్లుడు సాయి దుర్గ తేజ్ తన మొక్కను తీర్చుకున్నారు. తన కోరిక నెరవేరడంతో అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకుని శ్రీవారిని దర్శించుకునేందుకు సాయి దుర్గ తేజ్ వెళుతున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Sai Durga Tej: మామయ్య గెలిచాడు.. మొక్కు తీర్చుకోవడానికి వచ్చా..
Sai Durga Tej at Tirumala

మామయ్య పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గెలిస్తే.. కాలినడకన తిరుమలకు వస్తానని మొక్కుకున్న మేనల్లుడు సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej) తన మొక్కను తీర్చుకున్నారు. తన కోరిక నెరవేరడంతో అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల (Tirumala) కొండపైకి చేరుకుని శ్రీవారిని దర్శించుకునేందుకు సాయి దుర్గ తేజ్ వెళుతున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా మామయ్య పవన్ కళ్యాణ్ అంటే ఈ మేనల్లుడికి ఎంతో ఇష్టమో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం సాయి దుర్గ తేజ్ కాలినడకన తిరుమలకు వెళుతున్న వీడియోని మెగా ఫ్యాన్స్ బాగా వైరల్ చేస్తున్నారు.

Also Read- Niharika Konidela: అల్లు అర్జున్‌ని సాయి దుర్గా తేజ్ అన్ ఫాలో చేయడంపై నిహారిక స్పందనిదే..

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలలో NDA కూటమి (NDA Kutami) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. విజయం అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఏపీ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. కూటమి విజయానికి ప్రధాన కారణంగా నిలిచిన జనసేన అధినేత (Janasena Chief), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటు మరికొందరు విజేతలు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక శుక్రవారం సీఎం చంద్రబాబు తన కేబినెట్ మినిస్టర్స్ జాబితాను కూడా విడుదల చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. దీంతో ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తోన్న వీడియోను షేర్ చేస్తూ వస్తున్నారు.


Sai-Tej.jpg

ఎప్పటి నుంచో వేచి చూస్తున్న సందర్భమిది అంటూ పవన్ కళ్యాణ్‌ని అభిమానించే వారంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తుండగా.. ఇప్పుడు సాయి దుర్గ తేజ్ కూడా తన మామయ్య పట్ల గౌరవాన్ని, అభిమానాన్ని చాటి వార్తలలో నిలుస్తున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో గెలిచినప్పటి నుంచి ప్రతి క్షణాన్ని సాయి దుర్గ తేజ్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఎన్నికలలో పిఠాపురం నుంచి ఘన విజయం అనే వార్త రాగానే.. పవన్ కళ్యాణ్‌ని కలిసి తన ఆనందం షేర్ చేసుకున్నారు. అలాగే ఢిల్లీ పర్యటన అనంతరం మెగాస్టార్ ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్భంలోనూ సాయి దుర్గా తేజ్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అలాగే ప్రమాణ స్వీకార సమయంలోనూ ఆయన పవన్ కళ్యాణ్ వెన్నంటే ఉన్నారు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ విజయం కోసం ఆయన ప్రచారం కూడా చేశారు. (Sai Durga Tej and Pawan Kalyan)

Read Latest Cinema News

Updated Date - Jun 15 , 2024 | 01:37 PM