Nagarjuna: మంగళవారం కోర్టుకు నాగార్జున

ABN, Publish Date - Oct 07 , 2024 | 02:01 PM

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై (Konda Surekha) సినీ న‌టుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)వేసిన పిటిషన్‎పై నాంపల్లి మనోరంజన్ కోర్టులో  సోమవారం విచారణ జరిగింది

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై (Konda Surekha) సినీ న‌టుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)వేసిన పిటిషన్‎పై నాంపల్లి మనోరంజన్ కోర్టులో  సోమవారం విచారణ జరిగింది. నాగార్జున తరపున వాదనలను సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వినిపించారు.  మంగళవారం పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని కోర్ట్ తెలిపింది. దీనితో  నాగార్జున మంగళవారం కోర్ట్‎కు   హాజరు కానున్నారు. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలని రేపే నమోదు చేయాలని నాగార్జున తరపున న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు. తదుపరి విచారణను నాంపల్లి కోర్ట్ రేపటికి వాయిదా వేసింది.

పరువునష్టం దావా

 తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. హీరో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపగా.. తాజాగా హీరో నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

 

Updated Date - Oct 07 , 2024 | 03:10 PM