King Nagarjuna: మొన్న విమర్శలు.. ఇప్పుడేమో ప్రశంసలు

ABN , Publish Date - Jun 26 , 2024 | 08:37 PM

రెండు రోజుల క్రితం జరిగిన ఓ సంఘటనతో కింగ్ నాగార్జునపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తనని కలవడానికి వస్తున్న ఓ అభిమానిని పక్కన ఉన్న సెక్యూరిటీ సిబ్బంది పక్కకు లాగేస్తోన్న వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అయింది. ఈ ఘటనపై క్షమాపణలు కోరిన నాగ్ మళ్లీ.. ఆ అభిమానిని కలిసి హత్తుకుని, అతనితో ఫొటో దిగారు.

King Nagarjuna: మొన్న విమర్శలు.. ఇప్పుడేమో ప్రశంసలు
King Nagarjuna with His Fan

రెండు రోజుల క్రితం జరిగిన ఓ సంఘటనతో కింగ్ నాగార్జున (King Nagarjuna) పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తనని కలవడానికి వస్తున్న ఓ అభిమానిని పక్కన ఉన్న సెక్యూరిటీ సిబ్బంది పక్కకు లాగేస్తోన్న వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అయింది. ఈ వీడియోని షేర్ చేసిన కొందరు నెటిజన్లు ‘మానవత్వం ఎటు పోతుంది?’ అంటూ ప్రశ్నించారు కూడా. దీంతో కింగ్ నాగార్జున రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ వీడియోపై రియాక్ట్ అయిన నాగార్జున.. క్షమాపణలు కోరుతూ.. ఇది మళ్లీ రిపీట్ కాకుండా చూసుకుంటానని మాటిచ్చారు. మాట ఇచ్చినట్లుగానే నాగ్.. జరిగిన తప్పుని సరిచేశారు. ఎలా అనుకుంటున్నారా?

Also Read-Kalki 2898AD Review: మహాభారత యుద్ధం తరువాత ఏమి జరిగిందో ఊహాత్మకంగా...

తాజాగా కింగ్ నాగార్జున ముంబై విమానాశ్రయంలో (Mumbai Airport).. తన సెక్యూరిటీతో నెట్టివేయబడ్డ అభిమానిని (Nagarjuna Fan) కలిసి, అతనిని ఆప్యాయంగా హత్తుకోవడమే కాకుండా.. అతడికి ఫొటోలు కూడా ఇచ్చారు. దీంతో మొన్న విమర్శలు చేసిన వారే.. ఇప్పుడు రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక్కసారి నాగార్జున నోటీస్‌కు వచ్చిందంటే.. అది అంతే. ఇకపై అలాంటిది జరగదు అనేలా కింగ్ నాగ్ తన గొప్పతనాన్ని చాటాడు అంటూ ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన సెక్యూరిటీ చేసిన పని తనకు ఆలస్యంగా తెలిసిందని.. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటానని చెబుతూ.. సదరు వ్యక్తిని కింగ్ నాగ్ క్షమాపణలు కోరారు.


King.jpg

నిజంగా ఒక స్టార్ హీరో ఇలా క్షమాపణలు కోరడానికి ఘట్స్ కావాలి. ఎందుకంటే, అక్కడ నాగార్జునదేం తప్పులేదు. తన సెక్యూరిటీ చేసిన పనికి.. తనే తగ్గాడు. ఇప్పుడు అదే అభిమానిని మళ్లీ కలిసి.. తన సెక్యూరిటీ వల్ల జరిగిన తప్పును సరిచేశాడు. అందుకే కింగ్ నాగ్ ఫర్ ఏ రీజన్ అంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో నాగార్జున ‘కుబేర’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్ మెయిన్ హీరోగా నటిస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 26 , 2024 | 08:37 PM