Simbaa trailer is out: పర్యావరణం నేపథ్యంలో సూపర్ నేచురల్ థ్రిల్లర్

ABN, Publish Date - Jul 24 , 2024 | 11:53 AM

ప్రముఖ దర్శకుడు సంపత్ నంది, రాజేందర్ రెడ్డి తో కలిసి నిర్మించిన చిత్రం 'సింబా'. మురళి మోహన్ ఈ సినిమాకి దర్శకుడు. జగపతి బాబు, అనసూయ, దివి, గౌతమి, వశిష్ట సింహ, అనీష్ కురువిల్లా ఇంకా చాలామంది నటీనటులు వున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. 'మందు, దమ్ము వల్ల కాకుండా దుమ్ము వల్ల కూడా 25 శాతం మంది చనిపోతున్నారు' అనే విషయాన్ని జగపతి బాబు చెప్పడంతో ఈ సినిమా పర్యావరణం నేపథ్యంలో సాగుతుంది అని తెలుస్తోంది. అలాగే మొక్కలు నాటడం వలన సమాజం బాగుపడుతుంది అని చెప్పడం కూడా బాగుంది. 'సింబా' టైటిల్ కి 'ది ఫారెస్ట్ మాన్' అనే టాగ్ లైన్ కూడా ఇచ్చారు. అంటే ఇది పర్యావరణం నేపథ్యంలో వస్తున్న ఒక సూపర్ నాచురల్ థ్రిల్లర్ సినిమా అని చెప్పారు.

Updated at - Jul 24 , 2024 | 11:53 AM