సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Allu Aravind: ఇంటిపై దాడి.. అల్లు అరవింద్ ఏమన్నారంటే..

ABN, Publish Date - Dec 22 , 2024 | 09:09 PM

ఓయూ జెఎసి విద్యార్థుల పేరుతో కొందరు ఆందోళనకారులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఆందోళనకారులని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిపై తాజాగా అల్లు అరవింద్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే..

సంధ్య థియేటర్ ఘటనపై ఓయూ జెఎసి విద్యార్థుల పేరుతో కొందరు అల్లు అర్జున్ ఇంటిలోకి చొరబడి.. పూల కుండీలను విరగ్గొట్టారు. అక్కడున్న సిబ్బందిపై చెయ్యి చేసుకుంటూ.. అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు విసిరారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఇలా అల్లు అర్జున్ ఇంటిముందు ఆందోళన చేపట్టిన ఆందోళనకారులని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ ఘటనపై అల్లు అరవింద్ రియాక్ట్ అయ్యారు.

ఆయన మాట్లాడుతూ.. ‘‘మా ఇంటి వద్ద జరిగిన ఘటన అందరూ చూశారు. మా ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చి, ఆందోళన చేపట్టిన వారిపై కేసులు నమోదు చేశారు. మా ఇంటి దగ్గర ఎవరు గొడవ చేసినా పోలీసులు వాళ్ళను తీసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎవరు కూడా ఇలాంటి దుశ్చర్యలు ప్రేరేపించకూడదు. ప్రస్తుతం ఈ అంశంపై సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే సంయమనం పాటిస్తున్నాం. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని తెలిపారు.


Also Read-Allu Arjun Press Meet: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఏమన్నారంటే..

Also Read-అల్లు అర్జున్ కాలు విరిగిందా? చెయ్యి విరిగిందా?: సీఎం రేవంత్

Also Read-Sandhya Theatre Stampede: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 22 , 2024 | 09:11 PM