40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

SSMB29: ఎలా ఉండబోతోందంటే... హింట్‌ ఇచ్చిన రచయిత! 

ABN, Publish Date - Jan 23 , 2024 | 10:57 AM

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు(Maheshbabu), అగ్ర దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) కలయికలో 'ఎస్‌ఎస్‌ఎంబీ29' (SSMB29) రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని సినీ ప్రియులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు.

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు(Maheshbabu), అగ్ర దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) కలయికలో 'ఎస్‌ఎస్‌ఎంబీ29' (SSMB29) రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని సినీ ప్రియులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిత్ర రచయిత వి.విజయేంద్ర ప్రసాద్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా గురించి అప్‌డేట్‌ ఇచ్చారు. ఆ చిత్రం ‘ఇండియానా జోన్స్‌’లా(Indiana Jones) ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

‘‘ప్రస్తుతానికి ఈ సినిమాకి టైటిల్‌ ఖరారు కాలేదు. కథ ఎక్కువగా అడవి నేపథ్యంలో సాగుతుంది. పీరియాడికల్‌ కథ కాదు. స్క్రిప్ట్  పనులు పూర్తయ్యాయి. మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి’’ అని తెలిపారు. ‘ఈ సినిమాతో మహేశ్‌బాబు ఇమేజ్‌ మరింత పెరిగే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ‘ఏ సినిమాలో అయినా ప్రధాన పాత్ర పోషించే నటులకు మంచి గుర్తింపురావాలని మా వంతు ప్రయత్నం చేస్తాం’ అని విజయేంద్రప్రసాద్‌ (Vijayendra prasad)పేర్కొన్నారు.

అంతే కాదు బాలీవుడ్‌లొ ‘బజరంగి భాయిజాన్‌’ సీక్వెల్‌ కథ పూర్తయిందని, సల్మాన్‌ఖాన్‌కు వినిపించానని చెప్పారు. చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభమవుతుందనేది చూడాలన్నారు. తన డ్రీమ్‌ ప్రాజెక్టు అయిన ‘సీత’ను హాలీవుడ్‌ స్థాయిలో  రూపొందిస్తామని, ఆ పాత్రకు సరిపడ కొత్త నటి కోసం అన్వేషిస్తున్నామని చెప్పారు. 


Updated Date - Jan 23 , 2024 | 10:57 AM