Ananya Nagalla: ఏపీ సీఎంకు వ‌ర‌ద సాయం చెక్కు అంద‌జేసిన.. తెలుగు హీరోయిన్‌

ABN, Publish Date - Sep 18 , 2024 | 01:57 PM

ఇటీవ‌ల తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం సెలబ్రిటీలు విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా హీరోయిన్ ఆన‌న్య నాగ‌ళ్ల బుధ‌వారం ఏపీ ముఖ్య‌మంత్రిని క‌లిసి వ‌ర‌ద సాయం చెక్ అంద‌జేశారు.

Ananya

ఇటీవ‌ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) ప్రభుత్వాల పిలుపు మేరకు పలువురు సెలబ్రిటీలు విరాళాలను ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే టాలీవుడ్‌కు చెందిన సెల‌బ్రిటీలు త‌మ వంతు సాయం ప్ర‌క‌టించడ‌మే కాక‌ అయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను, డిప్యూటీ సీఎంల‌ను క‌లిసి త‌మ విరాళాల‌ను అంద‌జేశారు, ఇప్ప‌టికీ అంద‌జేస్తున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా హీరోయిన్ ఆన‌న్య నాగ‌ళ్ల (Ananya Nagalla) బుధ‌వారం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ( Chandrababu Naidu) ని స్వ‌యంగా క‌లిసి త‌ను సీఎం స‌హాయ‌నిధికి ప్ర‌క‌టించిన వ‌ర‌ద సాయం రూ.2.5 ల‌క్ష‌ల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన‌న్యను అభినందించారు.

Updated Date - Sep 18 , 2024 | 01:57 PM