Shyam prasad reddy: శ్యాం ప్రసాద్‌రెడ్డికి సతీవియోగం

ABN, Publish Date - Aug 08 , 2024 | 10:30 AM

ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్‌టైనమెంట్స్‌ అధినేత శ్యాం ప్రసాద్‌ద్‌ (Shyam prasad reddy) రెడ్డికి సతీవియోగం కలిగింది.

ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్‌టైనమెంట్స్‌ అధినేత శ్యాం ప్రసాద్‌ (Shyam prasad reddy) రెడ్డికి సతీవియోగం కలిగింది. ఆయన భార్య వరలక్ష్మి (Varalakshmi-62) బుధవారం రాత్రి ఎనిమిదిన్నర సమయంలో కన్ను మూశారు. కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌ వ్యాధితో బాధ పడుతున్నారు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.. వరలక్ష్మి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతగా  గుర్తింపు పొందిన శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి.. మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ స్థాపించి పలు సీరియల్స్‌తో పాటు టీవీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, అంజి, అరుంధతి వంటి హిట్  సినిమాలను అయన  నిర్మించారు.

Updated Date - Aug 08 , 2024 | 02:50 PM