Pushpa 2: పుష్ప-2 ఐటెమ్‌ గాళ్‌ దొరికేసినట్టే

ABN, Publish Date - Oct 19 , 2024 | 10:06 PM

‘పుష్ష 1’లో (Pushpa) 'ఊ అంటావా మావ ఊ.. ఊ అంటావా’ సాంగ్‌ దేశవ్యాప్తంగా సినీ ప్రియులను ఓ ఊపు ఊపింది. కొంతకాలం వరకూ జనాలు ఆ పాట ఫీవర్‌లోనే ఉన్నారు.


‘పుష్ష 1’లో (Pushpa) 'ఊ అంటావా మావ ఊ.. ఊ అంటావా’ సాంగ్‌ దేశవ్యాప్తంగా సినీ ప్రియులను ఓ ఊపు ఊపింది. కొంతకాలం వరకూ జనాలు ఆ పాట ఫీవర్‌లోనే ఉన్నారు. ఐటమ్‌ గాళ్‌గా సమంత దుమ్ము దులిపేసింది. ఇప్పుడు 'పుష్ప-2'లో కూడా ఆ పాటను కొట్టే పాటను సిద్దం చేస్తున్నారు సుక్కూ(Sukumar). అయితే ఆ పాటలో ఎవరు నటించబోతున్నారు? ఈసారి సుకుమార్‌ ఏ హీరోయిన్‌ని సుకుమార్‌ ఐటెమ్‌ గాళ్‌గా పరిచయం చేయబోతున్నారు? అనే ఎగ్జైట్‌మెంట్‌ బాగా ఉంది. అయితే ఆ జాబితాలో చాలా మంది పేర్లు వినిపించాయి. శ్రీ లీల, జాన్వీ, త్రిప్తి డిమ్రి ఇలా మంది పేర్లే వినిపించాయి. ఎట్టకేలకు శ్రద్దాకపూర్‌కు ఈ అవకాశం అందినట్టు తెలుస్తోంది. ఐటెమ్‌ గాళ్‌గా శ్రద్దా కపూర్‌ (Shraddha kapoor) ఎంపిక ఖాయమైందని, ఆమెకు అడ్వాన్సు కూడా ఇచ్చేశారని ఓ వార్త టాలీవుడ్‌ లో చక్కర్లు కొడుతోంది. (Pushpa 2 Item Song)



ఇటీవల చిత్రబృందం శ్రద్దా కపూర్‌ని సంప్రదించిన మాట వాస్తవం. జాన్వీ కంటే శ్రద్దా బెటర్‌ ఆప్షన్‌ అని సుకుమార్‌ కూడా అనుకున్నారట. ఈ మధ్యనే విడుదలైన ‘ ‘స్త్రీ 2’’తో సక్సెస్‌తో శ్రద్దా మంచి జోరు మీదుంది. అందుకు పుష్ప-2 ఐటెమ్‌ సాంగ్‌ ఆమె చెంతకు వెళ్లిందని తెలుస్తోంది. ఈ పాట కోసం శ్రద్దా కపూర్‌ రూ.4 కోట్లు డిమాండ్‌ చేసిందని, అడిగినంత ఇవ్వడానికి మైత్రీ మూవీస్‌ కూడా సిద్థమైందని ఇన్నర్‌ టాక్‌. నవంబరులో ఈ పాటని తెరకెక్కిస్తారు. దీంతో పాటు ఇంకో పాట బ్యాలెన్స్‌ ఉంది. దాన్ని కూడా నవంబరులోనే పూర్తి చేస్తారట. ఇటీవల ‘పుష్ష 2’ ఫస్టాఫ్‌ ఎడిటింగ్‌, ఆర్‌.ఆర్‌ వర్క్‌ పూర్తయ్యింది. ప్రస్తుతం సెకండాఫ్‌ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.  దీపావళి ‘పుష్ష 2’ నుంచి ఓ సర్‌ప్రైజ్‌ ఉండొచ్చని అంతా భావిస్తున్నారు. అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్నాన్ని డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Updated Date - Oct 19 , 2024 | 10:06 PM