మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Maheswari: సీరియల్‌ నటి మళ్లీ తల్లయింది

ABN, Publish Date - Apr 23 , 2024 | 02:57 PM

సీరియల్‌ నటి మహేశ్వరి (Maheswari) రెండోసారి తల్లయింది. ఇటీవల కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సీమంతం జరిగిన సంగతి తెలిసిందే! అయితే మంగళవారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

సీరియల్‌ నటి మహేశ్వరి (Maheswari) రెండోసారి తల్లయింది. ఇటీవల కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సీమంతం జరిగిన సంగతి తెలిసిందే! అయితే మంగళవారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డ.. ఆడ మగ అనేది చెప్పకుండా అందరి చేతులతో తీసిన ఓ ఫొటోని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. తోటి సీరియల్‌ నటీనటులు అందరూ మహేశ్వరికి (Maheswari become mother again) శుభాకాంక్షలు చెబుతున్నారు.

‘వదినమ్మ’, ‘శశిరేఖా పరిణయం’ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న మహేశ్వరి.. ఇస్మార్ట్‌ జోడీ, ఫ్యామిలీ నంబర్‌ 1, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లోనూ పాల్గొని ఆకట్టుకుంది. టాలీవుడ్‌లో డైరెక్షన డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న శివనాగ్‌ని ఆమె కొన్నేళ్ల క్రితం ఆమె పెళ్లాడింది. వీళ్లకు ఇప్పటికే ఓ కూతురు ఉంది. గతేడాది ప్రెగ్నెన్సీ ప్రకటించింది మహేశ్వరి.. రీసెంట్‌గా శివనాగ్‌ సడన్‌గా సీమంతం చేసి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఇప్పుడు ఈమెకు మరో బిడ్డ పుట్టింది. ఆ ఫొటోను పోస్ట్‌ చేసి తమ బుజ్జాయికి అందరి ఆశీసులు కావాలని క్యాప్షన్‌ ఇచ్చారు.

Read More: Tollywood, Cinema News

Updated Date - Apr 23 , 2024 | 03:07 PM