Rashmika Mandanna: బాధితులకు అండగా.. ప్రజలంతా ధైర్యంగా ఉండాలి!

ABN, Publish Date - Aug 03 , 2024 | 03:12 PM

కష్టం అంటే సాయం అందించడానికి ముందుంటారు నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న(Rashmika Mandanna). మరోసారి ఆమె తన మంచి మనసు చాటుకుంది.

కష్టం అంటే సాయం అందించడానికి ముందుంటారు నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న(Rashmika Mandanna). మరోసారి ఆమె తన మంచి మనసు చాటుకుంది. కేరళ వయనాడ్‌లో ( Rashmika Mandanna donates Rs 10 lakhs) ఇటీవల కొండచరియలు విరిగిపడి సృష్టించిన విషాదం పట్ల రష్మిక మందన్న స్పందించారు. బాధితులను ఆదుకునేందుకు కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం రూ10 లక్షల రూపాయలను విరాళం ప్రకటించారు. ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలంతా ధైర్యంగా ఉండాలని ఆమె పేర్కొంది. గతంలో కేరళలో వరదలు సంభవించిన సమయంలో కూడా రష్మిక తనవంతు సాయం అందించారు. ఈ ఏడాది యానిమల్‌ చిత్రంతో సూపర్‌ సక్సెస్‌ అందుకున్న ఆమె వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం 'పుష్ఫ-2' షూటింగ్‌తో బిజీగా ఉంది. దీనితో పాటు 'రెయిన్  బో', 'ద గర్ల్‌ఫ్రెండ్‌', 'కుబేర', 'సికందర్‌' చిత్రాలు చేస్తోంది.  (Wayanad Landslide)

Updated Date - Aug 03 , 2024 | 03:12 PM