Rajendra Prasad: నటుడు రాజేంద్రప్రసాద్‌ కుమార్తె మృతి.. విషయం ఏమిటంటే

ABN, Publish Date - Oct 05 , 2024 | 06:53 AM

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. నటకిరీటీ రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో చనిపోయారు.

Rajendra Prasad with His Daughter

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. నటకిరీటీ రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో చనిపోయారు. శుక్రవారం రాత్రి కార్డియాక్ అరెస్టుతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో గాయత్రి (Gayathri) కన్నుమూశారు. ఆమెకు తీవ్ర గ్యాస్ట్రిక్ సమస్య రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్‌‌కి తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూనే ఆమె హార్ట్ ఎటాక్‌కు గురై కన్నుమూశారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. బిడ్డ మరణంతో వారి ఇంట్లో తీవ్ర విషాదం నిండింది. గాయత్రి మృతిని తట్టుకోలేక రాజేంద్రప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read- Nagarjuna: ఆ రోజు ఇండస్ట్రీని పట్టించుకోలేదు.. ఈ రోజు నీ వెంటే ఇండస్ట్రీ.. తేడా తెలిసిందా నాగ్


ఈ విషయం తెలిసిన రాజేంద్రప్రసాద్ కుటుంబ సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీ, అభిమానులు ఆయనకు ధైర్యం చెబుతూ, ఆయన కుమార్తె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించేందుకు సినిమా ఇండస్ట్రీ తరపు నుండి ప్రముఖులందరూ ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.


అసలేం జరిగిందంటే..

శుక్రవారం గ్యాస్ట్రిక్ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న గాయత్రి.. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అయితే సడెన్‌గా అర్ధరాత్రి 12 గంటల 40 నిమిషాల సమయంలో ఆమెకు తీవ్రమైన హార్ట్ ఎటాక్‌కు వచ్చినట్లుగా తెలుస్తుంది. డాక్టర్స్ చికిత్స అందించినా పరిస్థితి చేయిదాటి పోవటంతో గాయత్రి కన్నుమూశారు. ఆదివారం గాయత్రి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా ‘మహానటి’ చిత్రంలో నటించింది.

Also Read- Prakash Raj: పవన్ కళ్యాణ్‌పై మరో ట్వీట్ పేల్చిన ప్రకాశ్ రాజ్..

Also Read- Thalapathy 69: విజయ్ లాస్ట్ సినిమా ఓపెనింగ్‌లో ఏం జరిగిందో తెలుసా?

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 05 , 2024 | 07:22 AM