Prakash Raj: కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ.. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి

ABN, Publish Date - Oct 01 , 2024 | 04:18 PM

గత కొద్దిరోజులుగా ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj) ట్విట్టర్‌ వేదికగా జస్ట్‌ ఆస్కింగ్‌ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

గత కొద్దిరోజులుగా ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj) ట్విట్టర్‌ వేదికగా జస్ట్‌ ఆస్కింగ్‌ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం Pawan kalyan తిరుమల లడ్డూ (Tirumala laddu) వివాదంపై స్పందించినప్పటి నుంచి ఆయన్ను టార్గెట్‌ చేస్తూ ప్రకాశ్‌ రాజ్‌ రోజుకో ట్వీట్‌ పెడుతున్నారు. మంగళవారం మరో ట్వీట్‌ చేశారు. ‘‘కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ! కదా? ఇక చాలు.. ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి’’ అని తాజా ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. 

తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్న విషయంపై పవన్‌ స్పందించినప్పటి నుంచి ప్రకాశ్‌రాజ్‌ ఇలా ట్వీట్లు చేస్తున్నారు. ఈ నెల 20న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎక్స్‌ ఖాతాను ట్యాగ్‌ చేస్తూ.. ‘‘మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలను కల్పించి, దీన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మనదేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు. (కేంద్రంలో ఉన్న మీ ేస్నహితులకు ధన్యవాదాలు జస్ట్‌ ఆస్కింగ్‌)’’ అంటూ పెట్టిన పోస్ట్‌ వైరల్‌ అయింది. సున్నితమైన అంశాలపై ప్రకాశ్‌రాజ్‌ తెలుసుకుని మాట్లాడాలని పవన్‌ వ్యాఖ్యానించారు. తాను షూటింగ్‌లో భాగంగా విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతానని ప్రకాశ్‌ రాజ్‌ ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే! తాజాగా ప్రకాష్‌రాజ్‌ ‘దేవర’లో సింగప్పగా కీలక పాత్రతో ఆకట్టుకున్నారు. 


Updated Date - Oct 01 , 2024 | 04:23 PM