Prabhas: టోక్యోలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కోలాహలం

ABN, Publish Date - Oct 20 , 2024 | 11:28 AM

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ పుట్టినరోజును ఫ్యాన్స్‌ గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేయడానికి సర్వం సిద్దం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 23న ప్రభాస్‌ నటించిన పలు చిత్రాలను రీ రిలీజ్‌ చేయబోతున్నారు.

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) పుట్టినరోజును ఫ్యాన్స్‌ గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేయడానికి సర్వం సిద్దం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 23న ప్రభాస్‌ (Prabhas Birthday in Tokyo) నటించిన పలు చిత్రాలను రీ రిలీజ్‌ చేయబోతున్నారు. ఇప్పటికే ఆయన నటించిన ‘రాధేశ్యామ్‌’ చిత్రాన్ని టోక్యోలో అభిమానులు ప్రత్యేక షో వేసుకుని వీక్షించారు. అంతే కాదు డార్లింగ్‌ ప్రభాస్‌ బర్త్‌డే వేడుకను అడ్వాన్స్‌గా నిర్వహించారు. ఇలా ఓ ఇండియన్‌ స్టార్‌ పుట్టినరోజును.. అది కూడా అడ్వాన్స్‌గా నిర్వహించడంతో ఆ దేశంలో ప్రభాస్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్‌ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘ది రాజా సాబ్‌’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు ప్రభాస్‌. ఈ సినిమా తరువాత హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ అనే సినిమాలో నటించనున్నాడు. తదుపరి సలార్‌, కల్కి2 సెట్స్‌లో అడుగుపెడతారని తెలుస్తోంది. (Tokyo Prabhas Fans)

Vidya Balan: విద్యాబాలన్‌పై ఆ ముద్ర పడటానికి కారణం.. అదే 


ఈసారి అభిమానులకు  పెద్ద ట్రీటే..

ప్రభాస్‌ నటించిన అరడజనకు పైగా సినిమాలు రీ రిలీజ్‌ చేయనున్నారు. మిస్టర్‌ పర్ఫెక్ట్‌, మిర్చి, ఛత్రపతి, ఈశ్వర్‌, రెబల్‌, సలార్‌ చిత్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్‌ కానున్నాయి. అక్టోబర్‌ 19, 20 తేదీల్లో సలార్‌ పార్ట్‌ 1 హైదరాబాద్‌లో స్పెషల్‌ షోలు ప్రదర్శించనున్నారు. 22న మిస్టర్‌ పర్ఫెక్ట్‌ చిత్రాన్ని దిల్‌ రాజు రీ రిలీజ్‌ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రభాస్‌ పుట్టినరోజున ఆయన హీరోగా పరిచయమైన 'ఈశ్వర్‌’ రీ రిలీజ్‌ అవుతోంది. ఇప్పటికే ఓసారి రీ రిలీజ్‌ అయిన 'రెబల్‌’ చిత్రం ఈ 23న మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. వీటితోపాటు ఛత్రపతి, మిర్చి, సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు స్పెషల్‌ షోలు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 

Updated Date - Oct 20 , 2024 | 11:55 AM