Prabhas: సందీప్‌ రెడ్డి వంగా ఇది నిజమేనా?

ABN, Publish Date - Aug 05 , 2024 | 04:00 PM

సిల్వర్‌  స్క్రీన్ పై కొన్ని జంటలు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్టారు.  తమ నటనతో మెస్మరైజ్‌ చేసిన జంటలను మళ్లీ మళ్లీ తెరపై చూడాలనుకుంటారు అభిమానులు. అలాంటి వాటిలో ప్రభాస్‌-త్రిష (Prabhas and Trisha) జంట ఒకటి.

సిల్వర్‌  స్క్రీన్ పై కొన్ని జంటలు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్టారు.  తమ నటనతో మెస్మరైజ్‌ చేసిన జంటలను మళ్లీ మళ్లీ తెరపై చూడాలనుకుంటారు అభిమానులు. అలాంటి వాటిలో ప్రభాస్‌-త్రిష (Prabhas and Trisha) జంట ఒకటి. వీళ్లిద్దరూ కలిసి మూడు చిత్రాల్లో నటించారు. ఇప్పుడు నాలుగోసారి జత కట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ‘వర్షం’, ‘బుజ్జిగాడు’, ‘పౌర్ణమి’ సినిమాలతో బెస్ట్‌ జోడీగా గుర్తింపు పొందిన ఈ జంట 'స్పిరిట్‌' (Spirit) సినిమా కోసం మరోసారి   స్క్రీన్  షేర్‌ చేసుకోబోతున్నారని సమాచారం. సందీప్‌ రెడ్డి వంగా(Sandeep Reddy vanga) దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ‘స్పిరిట్‌’ చిత్రం రానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు టాక్‌ వినిపిస్తోంది. త్రిష గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు కూడా పలు మీడియాలతోపాటు సోషల్‌ మీడియాలో వార్త వైరల్ అవుతోంది.



భారీ బడ్జెట్‌తె ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి  స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయినట్లు దర్శకుడు సందీప్‌ ఇటీవల ఓ వేదికపై తెలిపిన సంగతి తెలిసిందే! ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబు కానున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ శక్తిమంతమైన పోలీసు క్యారెక్టర్‌లో  కనిపించనున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాజాసాబ్‌’తో బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక త్రిష తాజాగా ‘బృంద’ సిరీస్‌తో అలరించింది. మెగాస్టార్‌ చిరంజీవి సరసన విశ్వంభరలో నటిస్తోంది.

Updated Date - Aug 05 , 2024 | 04:00 PM