Poonam Kaur: అప్పట్లో నా మాట పట్టించుకోలేదు.. త్రివిక్రమ్ పై పూనమ్‌ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Sep 17 , 2024 | 04:26 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు(Trivikram) , హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌కు (Poonam Kaur) మధ్య కొంతకాలంగా సోషల్‌ మీడియా వేదికగా గొడవ నడుస్తోంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో (Trivikram) హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌కు (poonam kaur) మధ్య కొంతకాలంగా సోషల్‌ మీడియా వేదికగా గొడవ నడుస్తోంది. సందర్భం వచ్చిన ప్రతిసారీ ఆమె త్రివిక్రమ్‌పై విరుచుకుపడుతుంది. తాజాగా మరోసారి ఆమె ట్విట్టర్‌ వేదికగా త్రివిక్రమ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్‌లో ఓ యువ డాన్సర్‌ను జానీ మాస్టర్‌ (jani master) లైంగికంగా వేధించాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫిల్మ్‌చాంబర్‌ ఆధ్వర్యంలో ఓ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి మహిళలకు ఇండస్ట్రీ అండగా ఉంటుంది.. పని ప్రాంతంలో ఎవరి వల్లనైనా ఇబ్బందులు ఎదుర్కొంటే ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన కమిటీకి ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రత్యేక కమిటీ నిందితులపై యాక్షన్‌ తీసుకుంటుందని మంగళవారం జరిగిన సమావేశంలో ఛాంబర్‌ పెద్దలు చెప్పారు. తాజాగా పూనమ్‌ చేసిన ట్వీట్‌ దీనికి స్పందనగా అనిపిస్తోంది. ఇండస్ర్టీ పెద్దలు త్రివిక్రమ్‌ను కూడా విచారించాలని ఆమె ట్వీట్‌లో కోరింది.

'‘త్రివిక్రమ్‌పై గతంలోనే మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశా. అప్పుడే త్రివిక్రమ్‌పై నా ఫిర్యాదు తీసుకుని విచారణ చేసి ఉంటే.. నేను, మరి కొందరు ఇన్ని రకాల రాజకీయ బాధలు పడేవాళ్లం కాదు. నేను సైలెంట్‌గా ఎంతో సఫర్‌ అయ్యాను. ఆ సమయంలోనే నేనీ విషయాన్ని చెప్పాను. ఫిర్యాదు కూడా చేశాను. కానీ అప్పుడు ఇండస్ట్రీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడైనా త్రివిక్రమ్‌ను విచారించాలని కోరుకుంటున్నా’’ అని పూనమ్‌కౌమ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.  



అయితే గతంలో కూడా త్రివిక్రమ్‌పై పూనమ్‌ ఎన్నో విమర్శలు చేసింది. అతనొక మోసగాడు అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఎన్నోసార్లు మండిపడింది. గతంలో పవన్‌కల్యాణ్‌కు, పూనమ్‌కు మధ్య సంబంధం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో త్రివిక్రమ్‌ చురుగ్గా వ్యవహరించాడని కూడా వార్తలు వచ్చాయి. ఓ పక్క మాలీవుడ్‌లో హేమ కమిటీ రిపోర్ట్‌, టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపులు కేసు నమోదైన నేపథ్యంలో పూనమ్‌ ట్వీట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది.

Updated Date - Sep 17 , 2024 | 04:59 PM