Paruchuri Gopala krishna: వినాయక మండపంలో పరుచూరి సందడి!

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:37 PM

సీనియర్‌ రచయిత, పరుచూరి Gబ్రదర్స్‌లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopalakrishna) గణేష్‌ మండపంలో సందడి చేశారు.

సీనియర్‌ రచయిత, పరుచూరి బ్రదర్స్‌లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopalakrishna) గణేష్‌ మండపంలో సందడి చేశారు. ఆయన ఇంటికి సమీపంలో ఉన్న గణేష్‌ నిమజ్జనం (Ganesh immersion) సందర్భంగా పూజలు నిర్వహించి అక్కడి భక్తులతో కలిసి డాన్స్‌లేశారు. గణపతి మట్టి విగ్రహాన్ని తలపై పెట్టుకుని ఆ మండపంలోని చిన్నారు, మహిళలతో కలిసి సరదాగా చిందేశారు.

ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. పరుచూరి బ్రదర్స్‌ ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథ, మాటలు అందించారు. దాదాపు 400లకు పైగా చిత్రాలకు వారు కథ, మాటలు అందించారు. తెలుగు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక శైలి రచన, గుర్తింపు సంపాదించుకున్నారు.

Updated Date - Sep 16 , 2024 | 01:51 PM