Nidhhi Agerwal: ఒకే రోజు.. రెండు సినిమాలు.. రెండు రాష్ట్రాల్లో..

ABN, Publish Date - Oct 17 , 2024 | 02:30 PM

నిధి అగర్వాల్ అభిమానుల్లో జోషల్‌ నింపేలా ఈ రెండు చిత్రాల నుంచి అప్‌డేట్‌ వచ్చింది. ఈ మేరకు నిధీ అగర్వాల్‌ ఓ ఆసక్తికర విషయం ట్వీట్‌ చేశారు.


నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇద్దరు అగ్ర హీరోల సరసన నటిస్తోంది. పవన్‌ (Pawan Kalyan) సరసన ‘హరిహర వీరమల్లు’ (HHVM) , ప్రభాస్‌తో  ‘రాజా సాబ్‌’ (Raja Saab) చిత్రాల్లో యాక్ట్‌ చేస్తున్నారు. అభిమానుల్లో జోషల్‌ నింపేలా ఈ రెండు చిత్రాల నుంచి అప్‌డేట్‌ వచ్చింది. ఈ మేరకు నిధీ అగర్వాల్‌ ఓ ఆసక్తికర విషయం ట్వీట్‌ చేశారు. ఒకే రోజు రెండు షూటింగ్‌లోఓ్ల పాల్గొంటున్నట్లు ఆమె తెలిపారు.

‘ఆర్టిస్టుల జీవితం ఎప్పుడూ సర్‌ప్రైజ్‌లతో నిండి ఉంటుంది. కొన్ని బ్లెస్సింగ్స్‌ ఎంతో గొప్పగా ఉంటాయి. అవి మర్చిపోలేని అనుభూతినిస్తాయి. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు పాన్‌ ఇండియా సినిమాలు ‘హరిహరవీరమల్లు’, ‘రాజా సాబ్‌’ చిత్రాల్లో నేను భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఒకేరోజు ఈ రెండు సినిమాల చిత్రీకరణలో పాల్గొవడం మరింత సంతోషాన్నిచ్చింది. అది కూడా ఒక సినిమా షూటింగ్‌ ఆంధ్రాలో, మరొకటి తెలంగాణలో. మా వర్క్‌ని మీ ముందుకు తీసుకురావడం కోసం వేచి చూస్తున్నా. ఈ సినిమాలు కచ్చితంగా పండగ వాతావరణాన్ని నింపుతాయి’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌పై దర్శకుడు మారుతి స్పందించారు. ‘అంకితభావంతో పని చేస్తున్నారు. ఆల్‌ ది బెస్ట్‌’ అని రిప్లై ఇచ్చారు. నిధీ అగర్వాల్‌ చేసిన పోస్ట్‌తో పవన్‌, ప్రభాస్‌ అభిమానుల్లో నూతన ఉత్సాహం నింపింది.  



ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ విజయవాడలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జరుగుతోంది. పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రమిది. క్రిష్‌ సారథ్యంలో జ్యోతికృష్ణ దర్శకత్వంలో రానుంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో పవన్‌ పేదల పక్షాన పోరాడే యోధుడిగా కనిపించనున్నారు. ఇక ‘రాజాసాబ్‌’ చిత్రానికొస్తే.. మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.   

Ram Charan: నిండైన మనసుతో పాపకు ప్రాణం పోశాడు


Updated Date - Oct 17 , 2024 | 02:35 PM