Natty Kumar: పవన్ కల్యాణ్ కాలి గోటికి.. ప్రకాష్ రాజ్ సరిపోడు

ABN, Publish Date - Oct 07 , 2024 | 05:41 PM

టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ ప్ర‌కాశ్ రాజ్‌పై ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం‌ మాట్లాడుతుంటే.. ప్రకాష్ రాజ్ ఇష్టం వచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నాడని.. అత‌నో స్వార్దపరుడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

natti kumar

టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ (NattiKumar) ప్ర‌కాశ్ రాజ్ (Prakash Raj)పై ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం‌ మాట్లాడుతుంటే.. అప్పటి నుంచే ఆయనంటే కొందరికి పడటం లేదని ప్రకాష్ రాజ్ ఇష్టం వచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నాడని.. ప్రకాష్ రాజ్ స్వార్దపరుడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎనాడన్నా ఇండస్ట్రీ కోసం , ప్రజల కోసం ఎమన్నా చేశావా ప్రకాష్ రాజ్.. ప్రజ్వల్ రేవన్న ఇన్సిడెంట్ పై ఎందుకు స్పందించలేదు, రజనీకాంత్‌ను అన్నప్పుడు ఏమి స్పందించలేదు.. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ పేరు చెప్పి దేవుడిని అవమానిస్తున్నాడని దుయ్య‌బ‌ట్టారు. పవన్ కల్యాణ్ కాలి గోటికి ప్రకాష్ రాజ్ సరిపోడని.. ఇదంతా డైవర్షన్ కోసం చేస్తున్నట్టుందని అన్నారు. ప్రకాష్‌రాజ్.. జగన్, కేటీఆర్‌ల ఏజెంట్.. కొండా సురేఖపై ఇండస్ట్రీ ట్వీట్స్ వెనుక కూడా ప్రకాష్ రాజే ఉన్నాడని అనుమానంగా ఉంద‌న్నారు. కేటీఆర్ కోసమే ఇదంతా చేసి ఉంటాడ‌న్నారు.

చిరంజీవి గారిని అవమానించినప్పుడు, ఐదు రూపాయల టికెట్ పెట్టినపుడు జ‌గ‌న్‌పై.. కేసీఆర్ ఇండస్ట్రీ అమ్మాయిలను డ్రగ్స్ పేరుతో నిలబెట్టినపుడు వారిపై ఎందుకు ట్వీట్ చేయలేదంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. అప్పుడు ఉంది మీ ప్రభుత్వాలే అనే చేయలేదా.. టీడీపీ, పవన్ కల్యాణ్ అధికారంలో ఉంటేనే మీరు ట్వీట్లు వేస్తారా అని అన్నారు. ఇంకా.. రేణు దేశాయ్ గారు ట్రోలింగ్ గురైనపుడు ఇండస్ట్రీ ఏమైంది, భువనేశ్వరి గారిపై అసభ్యంగా మాట్లాడినపుడు ఇండస్ట్రీ ఏమైంది, రజినీకాంత్‌పై నీచంగా మాట్లాడిన‌ప్పుడు, చిరంజీవి త‌ల్లి అంజ‌నా దేవిపై పోసాని అసభ్యంగా మాట్లాడితే ఖండన ఏది.. ప్రకాష్ రాజ్ ట్వీట్ ఎందుకు వేయలా.. జగన్ కేసీఆర్ అంటే మీకు భయమా అని నిల‌దీశారు. ప్రకాష్ రాజ్ ధైర్యం ఉంటూ పొలిటికల్‌గా వచ్చి పవన్ కల్యాణ్ ను ఎదుర్కోవాలి.. అంతేకానీ ఇండస్ట్రీ ముసుగులో ట్వీట్స్ కరెక్ట్ కాదని హిత‌వు ప‌లికారు.


కొండా సురేఖ ఓ నిర్మాత, బీసీ మహిళ.. ఆమెను ట్రోల్ చెస్తే.. ఇండస్ట్రీలో ఎవరు ఖండించలేదన్నారు. ఇటీవ‌ల మంత్రి మాట్లాడింది తప్పే‌‌.. కానీ ఆవిడ క్షమాపణ చెప్పారు.. కానీ నాడు వైసీపీ వారు, పోసాని మాట్లాడింది నీచాతినీచం. జానీ మాస్టర్ పై పొక్సో కేసు ఉందని ఇండస్ట్రీ వాళ్లే మెయిల్ పెట్టారు.. అందుకే అవార్డ్ రద్దైంది..దీని వెనుక కుట్ర కోణం ఉంది. నేషనల్ అవార్డ్ అనేది డాన్సర్స్ యూనియన్ కే గర్వకారణం. జానీ మాస్టర్ వ్యవహారంలో అసలు నిజాలు త్వ‌ర‌లోనే బయటకు వస్తాయి. అతనికి జరిగిన అన్యాయంపై డాన్సర్స్ యూనియన్ గట్టిగా మాట్లాడాలి.. జానీతో పాటు ఆ అమ్మాయి కార్డ్ కూడా క్యాన్సిల్ చేయాలి. జానీ అవకాశాలు అమ్మాయికి తరలించే ప్రయత్నం జరుగుతోంది. జానీ కుటుంబాన్ని రోడ్డున పడేయవద్దన్నారు. నేషనల్ కమిటీకి డాన్సర్స్ మెయిల్ పెట్టాల‌ని.. జానీ అవార్డ్ క్యాన్సిల్ అవ్వగానే.. బెయిల్ ను అతనే నిజాయితీగా క్యాన్సిల్ చేసుకున్నాడని జానీ విషయంలో సత్యమే గెలుస్తుందన్నారు. సినీ ఇండస్ట్రీని కాపాడండి..‌ అనవసరమైన అపార్దాలను ఇండస్ట్రీకి ఆపాందించవద్ద‌న్నారు.

తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు అన్నీ సాక్షాలతో ప్రెస్మీట్ పెట్టారు. గత ఐదు సంవత్సరాల్లో రెడ్డి గార్ల హాయంలో అన్యాయం జరిగిందనేది వాస్తవం. దర్శనం టికెట్లు బ్లాక్ లో అమ్మి డబ్బులు జగన్ ఎకౌంట్లో వేశారు. శేషాచలం అడవులను కొట్టేయటం వల్ల అడవి జంతువులు భక్తులపై దాడి చేశాయి. చంద్రబాబు గారు ఇంకా ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవటం లేదో తెలియ‌డం లేద‌న్నారు. జగన్ ను తిట్టండి.. ఏసు ప్రభును ఎందుకు తిడుతున్నారు.. త‌ప్పు చేసింది జగన్ మాత్రమేన‌ని అన్నారు.

పని చేసే వారికి.. నిజాయితీ పరులకు పదువులు ఇవ్వండి. కాకా పట్టే వారికే ఇంకా పదువులు ఇస్తున్నారు.. ‌గత ప్రభుత్వానికి మీకు తేడా ఏంటి.. మరలా ఇసుక దందాలు మొదలవుతాయని మంత్రి లోకేష్ దృష్టి పెట్టాల‌న్నారు. నారా లోకేష్ గారు ఫోన్ అందుబాటులో ఉన్నా.. కొందరు ఎంఎల్ఎలు ఫోన్లకు కూడా దొరకటం లేదన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం వెంటనే లొకేష్ రివ్యూలు చేస్తున్నారు. కానీ ఎంఎల్ఎ లు అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వీటిని చంద్రబాబు, లోకేష్, పవన్‌లు త్వ‌ర‌గా రెక్టిఫై చేయాలి. 2029లో లోకేష్ సీఎం కావాలని వ్యక్తిగతంగా అశిస్తున్నా అన్నారు.

Updated Date - Oct 07 , 2024 | 05:58 PM