Rapo 22: రామ్‌తో మైత్రి.. ఎలా ఉండబోతోందంటే.. ..

ABN, Publish Date - Oct 12 , 2024 | 07:18 PM

‘ఉస్తాద్‌’ రామ్‌ పోతినేని (Ram) హీరోగా  మైత్రి మూవీ మేకర్స్‌ (Mythri movie makers) సంస్థ ఓ చిత్రం తెరకెక్కించడానికి రంగం సిద్ధంమైంది.

‘ఉస్తాద్‌’ రామ్‌ పోతినేని (Ram) హీరోగా  మైత్రి మూవీ మేకర్స్‌ (Mythri movie makers) సంస్థ ఓ చిత్రం తెరకెక్కించడానికి రంగం సిద్ధంమైంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అగ్ర హీరోలతో పాన్‌ ఇండియా చిత్రాలు తీస్తున్న ‘మైత్రి’ సంస్థ రామ్‌ పోతినేనితో తీస్తున్న తొలి చిత్రమిది. నవీన్‌ పోలిశెట్టితో ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ సినిమా డైరెక్ట్‌ చేసి, ఘన విజయం అందుకున్న దర్శకుడు మహేష్‌బాబు (Mahesh Babu) దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. విజయదశమి సందర్భంగా శనివారం ఈ చిత్రాన్ని ప్రకటించారు.

హీరోగా రామ్‌ పోతినేనికి ఇది 22వ చిత్రమిది. నవంబర్‌ నుంచి చిత్రీకరణ మొదలు పెడతామని, రామ్‌ పోతినేనితో సినిమా చేయడం చాలా ఆనందంగా వుందని, హై ఎనర్జీతో న్యూ ఏజ్‌ స్టోరీ టెల్లింగ్‌తో ఈ చిత్రం వుంటుందని నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ తెలిపారు. కథానాయిక, ఇతర తారాగణం, సాంకేతిక బృందం వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. 

Updated Date - Oct 12 , 2024 | 07:18 PM