Manmadha: రీ రిలీజ్‌లోనూ.. కలెక్షన్ల‌తో దూసుకుపోతున్న మన్మధ

ABN, Publish Date - Oct 06 , 2024 | 04:39 PM

శింబు, జ్యోతిక హీరో హీరోయిన్లుగా 2004లో విడుదలైన మన్మధ చిత్రం ఈ ఏడాదితో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా అక్టోబర్ 5న ఈ మూవీని రీ రిలీజ్ చేయ‌గా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

manmadha

శింబు (Silambarasan), జ్యోతిక (Jyothika) హీరో హీరోయిన్లుగా 2004లో విడుదలైన మన్మధ (Manmadha) ఈ ఏడాదితో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. హీరో శింబునే ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్ అందించగా ఏ. జె. మురుగన్ (A. J. Murugan) దర్శకత్వం వహించారు. సింధు తులానీ, మందిరా బేడి, యానాగుప్త, అతుల్ కులకర్ణి, అర్జు గోవిత్రిక ముఖ్య పాత్రల్లో నటించారు. యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇప్ప‌టికీ ప్ర‌ముఖంగా వినిపిస్తాయి.

ఇదిలాఉండ‌గా అప్పట్లో ఈ సినిమా త‌మిళంలో 150 రోజుల‌కు పైగా ఆడి క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. ఈ చిత్రం హ‌క్కుల‌ను కేవ‌లం రూ.30 ల‌క్ష‌ల‌కు కొని తెలుగులో విడుద‌ల చ‌య‌గా రూ. 9కోట్లుకు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టి ఇక్క‌డా మ్యూజికల్ రొమాంటిక్ కల్ట్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు శింబుకు ప్ర‌త్యేక ఫ్యాన్ బేస్ ఏర్ప‌డింది. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ఇప్పుడు ఈ మూవీని సాయి సుధా రాచకొండ, అజిత్ కుమార్ సింగ్, వేమూరి శ్రేయస్, రమణ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 5న రీ రిలీజ్ చేశారు.


ఈ మధ్యకాలంలో రీ రిలీజులకు ఉన్న ట్రెండ్ ఏంటో మనందరం చూస్తున్నాం. ప్రస్తుత రిలీజ్ లకు దీటుగా రీ రిలీజ్ సినిమాలు కలెక్షన్లు సునామీ సృష్టిస్తున్నాయి. అదే కోవలో ఈనెల 5న రీ రిలీజ్ అయిన మన్మధ సినిమా కలెక్షన్లతో దూసుకుపోతోంది. శింబు, జ్యోతిక క్రేజ్, యువన్ శంకర్ రాజా పాట‌ల‌కు ఈల‌లు వేస్తున్నారు. జనరేషన్ తో సంబంధం లేకుండా ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టుగా అప్పటి సినిమాల్ని కూడా ట్రెండ్ కు తగ్గట్టుగా చూస్తున్నారు. థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు చేస్తున్న హాడావుడి, హంగామా చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఈ వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతుండ‌గా వాటిని చూసిన త‌మిళులు మ‌న్మ‌థ సినిమాకు తెలుగులో ఇంత క్రేజ్ ఏంటి అని స్ట‌న్ అవుతున్నారు.

Updated Date - Oct 06 , 2024 | 04:39 PM