మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Senthil Kumar wife: రూహి అంత్యక్రియలు పూర్తి

ABN, Publish Date - Feb 16 , 2024 | 02:31 PM

ప్రముఖ ఛాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్ భార్య రూహి నిన్న గురువారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె అంతక్రియలు ఈరోజు ఉదయం జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించారు

Cinematographer Senthil Kumar's wife, Roohi, passed away on Thursday afternoon

ప్రముఖ ఛాయాగ్రహకుడు సెంథిల్ కుమార్ భార్య రూహి నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం ఆమె అంత్యక్రియలు జూబిలీ హిల్స్ లోని మహాప్రస్థానంలో నిర్వహించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని సెంథిల్ స్నేహితులు సెంథిల్ ఇంటికి వెళ్లి పరామర్శించారు, ఇంకా కొంతమంది సన్నిహితులు అతనికి ఫోనులో తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు. సెంథిల్ భార్యగా కాకుండా రూహి యోగా నేర్పే గురువుగా చాలామంది నటీనటులకు, స్నేహితులకి పరిచయం.

భరత్ ఠాకూర్ దగ్గర మొదట్లో యోగా నేర్చుకున్న రూహి అక్కడే అనుష్క శెట్టి కూడా పరిచయం అయింది. ఆ తరువాత ఆమె చాలామంది నటీనటులకు యోగాలో శిక్షణ ఇచ్చేది అని తెలిసింది. ప్రముఖ నటి ఛార్మి తన ఇన్‌స్టాగ్రామ్ లో రూహి లేరనే వార్త వినగానే షాక్ కు గురయ్యని అని చెప్పారు. ఈ వార్త నిజం కాకపోతే బాగుణ్ణు అని ఆమె అన్నారు. రూహితో తన 18 సంవత్సరాల స్నేహాన్ని అందులో ఎన్నో తీయని, మధురమైన అనుభూతులు మిగిలాయి అని ఎంతో బాధగా చెప్పారు.

సెంథిల్ అగ్ర దర్శకుడు రాజమౌళి సినిమాలకి ఎక్కువగా పని చేసాడు. ఈ వార్త విన్న వెంటనే రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ లు సెంథిల్ ఇంటికి వెళ్లి అతన్ని పరామర్శించినట్టుగా తెలిసింది. అలాగే రామ్ చరణ్ అతని భార్య ఉపాసన సెంథిల్ ఇంటికి వెళ్లి అతనికి ధైర్యాన్ని చెప్పినట్టుగా తెలిసింది. ఈరోజు ఉదయం రాజమౌళి భార్య రమ, కుమారుడు కార్తికేయ సెంథిల్ నివాసానికి వెళ్లి అతన్ని పరామర్శించి రూహికి నివాళులు అర్పించారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కూడా ఈరోజు ఉదయం సెంథిల్ నివాసానికి వెళ్లి పలకరించిన వారిలో వున్నారని తెలిసింది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కూడా సెంథిల్ ని పరామర్శించారు.

ఇక తెలుగు పరిశ్రమకి చెందిన చాలామంది వ్యక్తులు సెంథిల్ తో ఫోన్ లో మాట్లాడినట్టుగా తెలిసింది. సెంథిల్ కి ధైర్యాన్ని ఇవ్వటమే కాకుండా, ఈ విషాద సమయంలో తాము అండగా ఉంటామని చెప్పినట్టుగా తెలిసింది. కళా దర్శకుడు రవీందర్ రెడ్డి నిన్నటి నుండి సెంథిల్ నివాసం వద్దనే వుండి కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించినట్టుగా తెలిసింది.

Updated Date - Feb 16 , 2024 | 02:31 PM