Keerthy Suresh: అతనిలా ఒక్కరోజైనా.. మనసులో మాట చెప్పింది

ABN, Publish Date - Aug 05 , 2024 | 06:50 PM

'దసరా' చిత్రానికిగానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్న కీర్తి సురేష్‌ (Keerthy Suresh) ప్రస్తుతం ఆ జోష్‌లో ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌ గురించి చెప్పుకొచ్చారు.


'దసరా' చిత్రానికిగానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్న కీర్తి సురేష్‌ (Keerthy Suresh) ప్రస్తుతం ఆ జోష్‌లో ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌ గురించి చెప్పుకొచ్చారు. అలాగే జూ.ఎన్టీఆర్‌తో(NTR) కలిసి నటించాలని ఉందన్నారు. ‘‘మొదటిసారి ఎన్టీఆర్‌ను ‘మహానటి’ ఆడియో లాంచ్‌ ఈవెంట్‌లో చూశాను. ఆయనతో కలిసి వర్క్‌ చేయాలనుంది. తెరపై మా జంట బాగుంటుంది. ‘మహానటి’ హిట్‌ తర్వాత ఆయన మా టీమ్‌ అందరికీ పార్టీ ఇచ్చారు. చాలా మంచి వ్యక్తి. ఎనర్జిటిక్‌గా ఉంటారు’’ అని కీర్తి తన మనసులో మాట బయటపెట్టింది.  

అలాగే బన్నీ (Allu arjun) గురించి కూడా మాట్లాడింది. అవకాశం వేస్త ఒక్కరోజు అల్లు అర్జున్‌లా లైఫ్‌ లీడ్‌ చేయాలనుకుంటానని తెలిపారు. ఆయనకు ప్రజల్లో విపరీతమైన ఫ్యాన్  ఫాలోయింగ్‌ ఉందని, ఆయనలా డ్యాన్స్‌ చేయాలనుకుంటున్నానని అన్నారు.  ప్రస్తుతం కీర్తి సురేశ్‌ నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె ప్రధాన పాత్రలో సుమన్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్న వినోదాత్మక చిత్రం ‘రఘుతాత’. ఈ చిత్రం ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. హిందీ రాని ఓ తమిళ అమ్మాయి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందనే నేపథ్యంలో ఈ చిత్రం రానుంది. ఆగస్టు 15న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

Updated Date - Aug 05 , 2024 | 06:50 PM