Kalki: టికెట్‌ ధర పెంపు.. అదనపు షోలు!

ABN, Publish Date - Jun 23 , 2024 | 10:34 AM

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా టికెట్‌ ధర పెంపు, అదనపు షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ప్రభాస్‌ (kalki) కథానాయకుడిగా నాగ్‌అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా టికెట్‌ ధర పెంపు, అదనపు షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 27 నుంచి జులై 4 వరకు 8 రోజుల పాటు టికెట్‌ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. టికెట్‌ ధర పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ వైజయంతీ మూవీస్‌ దరఖాస్తు చేసుకుంది. ‘కల్కి 2898 ఏడీ’ చిత్ర టికెట్‌పై గరిష్ఠంగా రూ.200 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్  థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 వరకు పెంచుకోవచ్చని పేర్కొంది. దీంతో పాటు ఈ నెల 27న ఉదయం 5.30 గంటల షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారం రోజుల పాటు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ ‘కల్కి’ టికెట్‌ ధరపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ప్రభాస్‌, దీపికా పడుకోన్ (Deepika padukone) నటీనటులుగా నాగ్‌ అశ్విన దర్శకత్వం వహించిన చిత్రమిది. వైజయంతీ మూవీస్‌ క్రియేషన్స సి.అశ్వనీదత  నిర్మించారు. అమితాబ్‌ బచ్చన్, కమల్‌ హాసన్, రాజేంద్రప్రసాద్‌, శోభన, దిశా పటానీ కీలక పాత్రధారులు.

Updated Date - Jun 23 , 2024 | 10:34 AM