Jr Ntr: అమ్మ కల నెరవేరింది!

ABN, Publish Date - Aug 31 , 2024 | 05:26 PM

జూ. ఎన్టీఆర్‌ (Jr NTR) శనివారం తన తల్లితో కలిసి ఉడుపి శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించారు. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, కన్నడ నటుడు రిషబ్‌శెట్టి కూడా తారక్‌తో ఉన్నారు

జూ. ఎన్టీఆర్‌ (Jr NTR) శనివారం తన తల్లితో కలిసి ఉడుపి శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించారు. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, కన్నడ నటుడు రిషబ్‌శెట్టి కూడా తారక్‌తో ఉన్నారు. దర్శనం అనంతరం ఆలయం ఎదుట తన తల్లితో కలిసి దిగిన ఫొటోలను ఎన్టీఆర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ‘అమ్మ ఎప్పుడూ నన్ను తన సొంతూరు కుందాపురాతోపాటు(Kundapura), ఉడుపి శ్రీకృష్ణుడి దర్శనానికి వెళదామని అడుగుతుంటుంది. ఇప్పుడు ఆమె కల నెరవేరింది. సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజు ముందు నేను ఆమెకు ఇచ్చే మంచి బహుమతి ఇదే. విజయ్‌ కిరంగదూర్‌ (Vijay Kirangadhur) సర్‌.. మీకు ధన్యవాదాలు. నా ప్రియమిత్రుడు ప్రశాంత్‌ నీల్‌తో కలిసి రావడం సంతోషంగా ఉంది. అలాగే రిషబ్‌శెట్టి కూడా వచ్చి ఈ క్షణాలను మరింత ప్రత్యేకంగా మార్చారు’’ అని ఎక్స్‌ వేదికగా ఎన్టీఆర్‌ ఫొటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు  సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.


ప్రస్తుతం తారక్‌ ‘దేవర’లో (Devara) చిత్రంతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకుడు. జాన్వీకపూర్‌ కథానాయిక. రెండు భాగాలుగా ఈ చిత్రం మొదటి భాగం సెప్టెంబరు 27న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అంతే కాదు బాలీవుడ్‌లో ‘వార్‌2’లో ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌తో సినిమా చేయబోతున్నారు. ఇటీవల పూజా కార్యక్రమలు జరిగాయి. 

Updated Date - Aug 31 , 2024 | 05:26 PM