Nenu Keerthana: ‘సీతా కోకై ఎగిరింది మనసే’ లిరిక‌ల్‌కు అసాధారణ స్పందన

ABN, Publish Date - Jun 24 , 2024 | 07:50 PM

చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం నేను కీర్తన. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల దర్శకుడు సాయి రాజేష్ విడుదల చేసిన సీతాకోకై ఎగిరింది మనసే లిరికల్‌కు అసాధారణ స్పందన లభిస్తోంది.

nenu keethana

చిమటా రమేష్ బాబు (ChimataRamesh) హీరోగా, స్వీయ దర్శకత్వంలో రిషిత, మేఘన హీరోహీరోయిన్లుగా చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం నేను కీర్తన (Nenu Keerthana). చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన ఈ సినిమా త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు రెడీ అవుతోంది.

ఈ క్ర‌మంలో ఇటీవ‌ల దర్శకుడు సాయి రాజేష్ విడుదల చేసిన సీతాకోకై ఎగిరింది మనసే లిరికల్‌కు అసాధారణ స్పందన లభిస్తోంది. ఈ పాటను కులుమనాలిలో పలు అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర దర్శకుడు, హీరో చిమటా రమేష్ బాబు మాట్లాడుతూ లిరికల్ వీడియోకు అనూహ్యమైన స్పందన వస్తుండడం ఈ చిత్ర విజయపై మేము పెట్టుకున్న నమ్మకాన్ని రెట్టింపు చేసిందని, ఈ పాటను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అన్నారు.


సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉన్న "నేను కీర్తన" చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతో పాటు.. ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని చిత్ర బృందం తెలిపింది.

Updated Date - Jun 24 , 2024 | 08:53 PM