Chiyaan Vikram: చాలాసార్లు మాట్లాడుకున్నాం.. కానీ ఆ సినిమా కోసం కాదు!

ABN, Publish Date - Aug 06 , 2024 | 10:54 AM

చియాన విక్రమ్‌(Vikram) జనసేనాని పవన్  కల్యాణ్‌(Pawan kalyan), సూపర్ స్టార్  మహేష్‌ (Maheshbabu) హీరోగా నటిస్తున్న 'ఎస్‌ఎస్‌ఎంబీ 29' (SSMB29) చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

చియాన విక్రమ్‌(Vikram) జనసేనాని పవన్  కల్యాణ్‌(Pawan kalyan), సూపర్ స్టార్  మహేష్‌ (Maheshbabu) హీరోగా నటిస్తున్న 'ఎస్‌ఎస్‌ఎంబీ 29' (SSMB29) చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్  రాజకీయాల్లో కీలక మార్పు తీసుకువచ్చిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. ఆయన గురించి ఏం చెబుతారు’ అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ వేదికపై ‘తంగలాన్‌’ గురించే మాట్లాడాలనుకున్నా. కానీ, పవన్ కల్యాణ్‌ గురించి ఈ ప్రశ్నను మిస్‌ చేసుకోవాలనుకోవడం లేదు.  ఆయన వర్క్‌ నాకెంతో ఇష్టం. అద్భుతమైన వ్యక్తి.   పవన్‌ కల్యాణ్‌ సాధించిన విజయం చారిత్రాత్మకం. దాదాపు 10 ఏళ్లు శ్రమించి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారంటే అది చాలా పెద్ద విషయం. మాలాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తిగా నిలిచారు’’ అని అన్నారు.


అలాగే రాజమౌళి, మహేష్‌బాబు కాంబోలో వస్తున్న సినిమా కోసం మిమ్మల్ని సంప్రదించారని వార్తలు వస్తున్నాయి అన్న ప్రశ్నకు "రాజమౌళి చాలా మంచి వ్యక్తి. మేము అప్పుడప్పుడూ మాట్లాడుకుంటాం. భవిష్యత్తులో కలిసి సినిమా చేయాలనుకున్నాం. ప్రత్యేకంగా ఒక సినిమా గురించి మేము ఎప్పుడూ మాట్లాడుకోలేదు. తెలుగులో  స్ట్రెయిట్   సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది’’ అని అన్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం 'తంగలాన్' . పా. రంజిత దర్శకుడు. కె.ఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మాత. తాజాగా హైదరాబాద్‌లో చిత్ర బృందం విలేకర్ల సమావేశంలో పాల్గొంది. ఆగస్ట్‌ 15న ఈ చిత్రం విడుదల కానుంది.

Updated Date - Aug 06 , 2024 | 10:54 AM