40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ram Mandir - Chiranjeevi: నాకు దక్కిన అరుదైన అవకాశమిది! 

ABN, Publish Date - Jan 22 , 2024 | 10:26 AM

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి (Ayodhya Ram Mandir) మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) దంపతులు బయలుదేరి వెళ్లారు. చిరంజీవి, సురేఖ, రామ్‌చరణ్‌ (Ram charan) ప్రత్యేక విమానంలో బయలుదేరి అయోధ్య చేరుకున్నారు.

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి (Ayodhya Ram Mandir) మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) దంపతులు బయలుదేరి వెళ్లారు. చిరంజీవి, సురేఖ, రామ్‌చరణ్‌ (Ram charan) ప్రత్యేక విమానంలో బయలుదేరి అయోధ్య చేరుకున్నారు. సోమవారం అయోధ్యలో జరిగే రామ్‌ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మెగాస్టార్‌ దంపతులు పాల్గొననున్నారు. అయోధ్య ఎయిర్‌పోర్ట్‌లో శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్‌ ప్రతినిధులు చిరు కుటుంబానికి స్వాగతం పలికారు. సంబంధిత ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 


అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ఆహ్వానం అందడం నాకు దక్కిన అరుదైన అవకాశమని, ఈ కార్యక్రమంలో పాల్గొవడం తన పూర్వ జన్మ సుకృతమని మెగాస్టార్‌ తెలిపారు. తన ఆరాధ్య దైవం హనుమంతుడు స్వయంగా భూలోక అంజనీదేవి కుమారుడు చిరంజీవిని వ్యక్తిగతంగా ఆహ్వానించినట్లుగా భావిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. 

Updated Date - Jan 22 , 2024 | 11:20 AM