TG Vishwa Prasad: ‘బ్రో’.. ఈ నిర్మాత ఘట్సే ఘట్స్

ABN, Publish Date - Jun 25 , 2024 | 08:52 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ భారీగా గెలవడంతో సినీ పరిశ్రమ సంబురాలు చేసుకుంటుంది. ఈ క్రమంలో నిర్మాత TG విశ్వప్రసాద్ ఎన్న‌డు ఏ పార్టీకి జ‌రుగ‌ని విధంగా, ధైర్యంగా ఇటీవల హైదరాబాద్‌లో గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

pawan kalyan

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆయన పార్టీ భారీగా గెలవడంతో సినీ పరిశ్రమ కూడా సంబురాలు చేసుకుంటుంది. ఈ క్రమంలో టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) అధినేత TG విశ్వప్రసాద్ (Vishwa Prasad) కూటమి గెలిచినందుకు ఇటీవల హైదరాబాద్‌లోని ఓ కన్వెన్షన్ హాల్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి డైరెక్టర్ మారుతి, శ్రీవాస్, శ్రీరామ్ ఆదిత్య, హీరో తేజ సజ్జా, నిర్మాత SKN, దామోదర ప్రసాద్, బాలాదిత్య, సప్తగిరి, హైపర్ ఆది, ఆర్పీ పట్నాయక్, రామజోగయ్య శాస్త్రి, సింగర్ మంగ్లీ. చాలా మంది నటీనటులు, సింగర్స్ వచ్చారు. అలాగే ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. కూటమి విజయం కోసం కష్ట పడిన పలువురిని నిర్మాత విశ్వప్రసాద్ (Vishwa Prasad) సత్కరించారు.


తాజాగా తెలుగు సినీ పరిశ్రమ నిర్మాతలంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను కలిసి సినీ పరిశ్రమ, థియేటర్స్ సమస్యలు చర్చించారు. అనంతరం ఇటీవ‌ల యువ హీరోలు, అగ్ర హీరోలతో వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న‌ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory), పీపుల్ టెక్ గ్రూప్ అధినేత TG నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా కలిసి అభినందించారు. పవన్ కళ్యాణ్ గారికి, నిర్మాత TG విశ్వప్రసాద్ గారికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో విశ్వప్రసాద్ గతంలో 'బ్రో' సినిమా చేయ‌డ‌మే కాక‌ జనసేన పార్టీకి కూడా అండగా నిలబడ్డారు.

Updated Date - Jun 25 , 2024 | 08:52 PM