దర్శకుడితో పెళ్లంటూ ఫొటోలు వైరల్‌!

ABN, Publish Date - Jul 27 , 2024 | 05:03 PM

కొన్నాళ్ల క్రితం సాయిపల్లవి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసేసుకుందని సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే! అందుకు కారణం లేకపోలేదు.

కొన్నాళ్ల క్రితం సాయిపల్లవి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసేసుకుందని సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే! అందుకు కారణం లేకపోలేదు. సంప్రదాయ దుస్తుల్లో మెడలో పూల మాల ధరించి దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియస్వామి పక్కన కనిపించడంతో వారిద్దరూ పెళ్లి చేసేసుకున్నారని టాక్‌ నడిచింది. అది శివ కార్తికేయన్21 చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటో అని తర్వాత తెలిసింది.

ఇప్పుడు అలాగే మరో జంట విషయంలో అలాగే జరిగింది. తమిళంలో ‘అడియే’, ‘తిట్టం ఇరండు’, ‘హాట్‌ స్పాట్‌’ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విఘ్నేశ్‌ కార్తీక్‌.. యంగ్‌ హీరోయిన్‌ బ్రిగిడ సాగాతో కలిసి సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో కనిపించాడు. ఆ ఫొటోని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. సడన్‌గా చూసి నిజంగానే ఈ డైరెక్టర్‌, హీరోయిన్‌ పెళ్లి చేసుకున్నారేమో అనుకున్నారు. అయితే ఇదంతా ఓ సినిమా కోసం జరిగిన షూట్‌. దర్శకుడు విఘ్నేశ్‌ కార్తీక్‌కి ఇదివరకే పెళ్లయింది. మరోవైపు బ్రిగిడ.. తమిళ, తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. అయితే వీళ్లిద్దరూ పెళ్లి డ్రస్సులో కనిపించేసరికి చాలామంది ఇది నిజమేనేమో అనుకున్నారు. అసలు విషయం తెలిసి తాపీగా నవ్వుకున్నారు.

Updated Date - Jul 27 , 2024 | 05:03 PM