Bahubali 3: తమిళ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎప్పుడు మొదలంటే..

ABN, Publish Date - Oct 17 , 2024 | 09:55 AM

'బాహుబలి -3' (Bahubali 3) గురించి తమిళనిర్మాత కె.ఈ జ్ఞానవేల్‌ రాజా (K. E. Gnanavel Raja)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'బాహుబలి -3' (Bahubali 3) గురించి తమిళనిర్మాత కె.ఈ జ్ఞానవేల్‌ రాజా (K. E. Gnanavel Raja)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తాచాటిన ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు ఆయన నిర్మాతగా వ్యవహరించారు.  ఈ సినిమా రెండు భాగాలు సక్సెస్‌ సాధించి భారీ వసూళ్లు రాబట్టడంతో అభిమానులు పార్ట్‌ 3 కోసం ఎదురు చూస్తున్నారు.  తాజాగా కోలీవుడ్‌ నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనిపై ఆసక్తికర కామెంట్‌ చేశారు. ‘కంగువా’ సీక్వెన్స్‌ల మధ్య  గ్యాప్‌ను సమర్థిస్తూ ‘బాహుబలి 3’ ప్రస్తావనను తీసుకొచ్చారు. ‘కంగువా’ ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత వారం బాహుబలి మేకర్స్‌తో చర్చించాను. పార్ట్‌ 3 ప్లాన్‌ చేేస పనిలో ఉన్నారు. దానికంటే ముందు రెండు సినిమాలు ఉన్నాయి. వాటి తర్వాతే ‘కల్కి 2’, ‘సలార్‌ 2’ రిలీజ్‌ అవుతాయి’ అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘బాహుబలి-3’ కోసం వెయిటింగ్‌ అంటూ ప్రభాస్‌ ఫ్యాన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు.

గతంలో కూడా రాజమౌళి ఒక సందర్భంలో బాహుబలి-3’ గురించి మాట్లాడారు. ‘‘దీని మూడో భాగం ఉంటుంది. ‘బాహుబలి’ చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు ఈసారి మీకు చూపించనున్నాం. దీనికి సంబంధించిన వర్క్‌ చేస్తున్నాం. మా నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ సినిమా రావడానికి కాస్త సమయం పట్టొచ్చు.  కానీ ‘బాహుబలి’ రాజ్యం నుంచి ఆసక్తికర వార్త అయితే కచ్చితంగా ఉంటుంది’’ అని అన్నారు.

ప్రస్తుతం రాజమౌళి..(SS Rajamouli) మహేశ్‌ సినిమాతో 'ఎస్‌ఎస్‌ఎంబీ29' చిత్రం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు, ఫొటో షూట్‌లు జరుగుతున్నాయి. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు విదేశీ  భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 

Updated Date - Oct 17 , 2024 | 09:58 AM