Vishwambhara: ఇట్స్ ఐటెం సాంగ్ టైమ్

ABN, Publish Date - Aug 03 , 2024 | 04:35 PM

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. త్రిష కథానాయిక. సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే.

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా వశిష్ట మల్లిడి (Vasishta) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). త్రిష కథానాయిక (Trisha). సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో చిరంజీవి భీమవరం దొరబాబుగా కనిపించనున్నారు. ఈ సినిమాలో కొన్ని ప్రత్యేకమైన పాత్రలున్నాయి. అందులో ‘నా సామి రంగ’ ఫేమ్‌ ఆషికా రంగనాథ్‌ కనిపించబోతోంది. చిరు చెల్లెళ్లుగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు కూడా తెరపై సందడి చేయనున్నారు. ఇందులో ఓ ప్రత్యేక గీతం కూడా ఉందని సమాచారం. ఆ పాటలో ఓ ప్రముఖ కథానాయిక కనిపించబోతోందని తెలిసింది. ఆ హీరోయిన్‌ కోసం ప్రస్తుతం అన్వేషణ ప్రారంభించారు. తెలుగులో టాప్‌ లీడ్‌ లో ఉన్న కథానాయికే.. తెరపై చిరంజీవితో స్టెప్పులు వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన ఓ సెట్‌ ని అన్నపూర్ణ స్టూడియోలో తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే కీరవాణి పాటను సిద్థం చేశారట. ఇక కథానాయిక ఫైనల్‌ అయితే పాట షూటింగ్‌ మొదలెట్టేస్తారు. మరో రెండ్రోజుల్లో కొత్త షెడ్యూల్‌ ప్రారంభిస్తారు. ఈ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస?్తరు. తదుపరి షెడ్యూల్‌లో ఐటెమ్‌సాంగ్‌తోపాటు క్లైమాక్స్‌ సన్నివేశాలను తెరకెక్కిస్తారనవి సమాచారం. యు.వి.క్రియేషన్స్  సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది.



Updated Date - Aug 03 , 2024 | 04:39 PM