Nayanthara: విష్ణువర్థన్ నా ఫ్యామిలీ.. అందుకే ఈ వేడుకకు వచ్చా

ABN, Publish Date - Jul 03 , 2024 | 11:55 AM

నేను ఎలాంటి సినిమా కార్యక్రమాల్లో పాల్గొనను. కానీ దర్శకుడు విష్ణువర్థన్ మై ఫ్యామిలీ అని అందుకే ఈ వేడుకకు వచ్చానని సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అన్నారు.

nayanatara

వెండితెరపై చాలా రోజుల తర్వాత ఓ స్వీట్‌ లవ్‌ స్టోరీని చూడబోతున్నామని సీనియర్‌ నటి నయనతార అన్నారు. విష్ణువిర్థన్‌ దర్శకత్వంలో ఆకాష్‌ మురళి (Akash Murali), అదితి శంకర్ (Aditi Shankar) జంటగా నటించిన చిత్రం ‘నేసిప్పాయ’(Nesippaya). జేవియర్‌ బ్రిట్టో సమర్పణలో ఎక్స్‌బీ ఫిలిమ్స్‌ పతాకంపై నిర్మాత స్నేహ బ్రిట్టో నిర్మించారు. ఈ చిత్రం ద్వారా ఆకాష్‌ మురళి తమిళ వెండితెరకు హీరోగా పరిచయమవుతున్నారు. ఇటీవ‌ల‌ ఈ సినిమా పోస్టర్‌ రిలీజ్‌ వేడుక తాజాగా నగరంలో జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో హీరోయిన్‌ నయనతార, హీరో ఆర్య, త్యాగరాజన్‌, డాక్టర్‌ ఐసరి కె.గణేష్‌ వంటి అనేక మంది ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా నయనతార (Nayanthara) మాట్లాడుతూ, ‘ఈ సినిమా ద్వారా కోలీవుడ్‌కు పరిచయమవుతున్న ఆకాష్‌ మురళి (Akash Murali)కి నా బెస్ట్‌ విషెస్‌. హీరోయిన్‌ అదితి శంకర్ (Aditi Shankar) అంటే ఎంతో ఇష్టం. మంచి ప్రతిభ కలిగిన నటి. నేను ఎలాంటి సినిమా కార్యక్రమాల్లో పాల్గొనను. కానీ, ఇది నాకు ఎంతో స్పెషల్‌. దర్శకుడు విష్ణువర్థన్ (Vishnu Varadhan), అనుల చిత్రం ఇది. వారిద్దరు 15 యేళ్ళుగా తెలుసు. ఒక విధంగా చెప్పాలంటే ఇది మై ఫ్యామిలీ. అందుకే ఈ వేడుకకు వచ్చాను. ఇంత మంది సినీ ప్రముఖుల సమక్షంలో ఆకాష్‌ మురళిని పరిచయం చేయడం సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత స్వీట్‌ లవ్‌ స్టోరీని చూడబోతున్నాం’ అని పేర్కొన్నారు.


దర్శకుడు విష్ణువర్ధన్ (Vishnu Varadhan) మాట్లాడుతూ, ‘ఈ సినిమా ఒక లవ్‌ డ్రామా మూవీ. కథలో యాక్షన్‌ కూడా ఉంది. ఇందులో నూతన నటుడు ఆకాష్‌ హీరోగా, అదితి ఎంతో ఎనర్జిటిక్‌గా నటించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది’ అన్నారు. నిర్మాత జేవియర్‌ బ్రిట్టో మాట్లాడుతూ, ‘ఆకాషను గ్రాండ్‌ లెవల్‌లో వెండితెరకు పరిచయం చేయాలన్న కోరిక నెరవేరింది. విష్ణువర్ధన్‌ వంటి స్టార్‌ దర్శకుడి ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీత దర్శకత్వంలో పాటలు చాలా బాగా వచ్చాయి’ అన్నారు.

Updated Date - Jul 03 , 2024 | 01:58 PM