Namitha: దేవాలయ సిబ్బందిపై నటి అసహనం!

ABN, Publish Date - Aug 26 , 2024 | 05:16 PM

మధుర మీనాక్షి దేవాలయ (Madhura meenakshi Temple) సిబ్బందిపై నటి నమిత (Namitha)మండిపడ్డారు.

మధుర మీనాక్షి దేవాలయ (Madhura meenakshi Temple) సిబ్బందిపై నటి నమిత (Namitha)మండిపడ్డారు. దర్శనానికి వెళ్లిన ఆమెను లోపలికి అనుమతించలేదని, అగౌరవంగా మాట్లాడారని నమిత ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ‘‘కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా కుటుంబంతో కలిసి మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్లా. ఆలయంలోకి వెళ్లకుండా అక్కడి సిబ్బంది నన్ను అడ్డుకున్నారు. నాకు సంబంధించిన సర్టిఫికెట్స్‌ చూపించమన్నారు. ఈ వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రముఖ ఆలయాలను నేను సందర్శించినట్లు చెప్పా. ఆ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా’’ అని నమిత పేర్కొన్నారు.

ప్రస్తుతం నమిత వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారడంతో ఈ ఘటనపై ఆలయ పరిపాలన సిబ్బంది స్పందించారు. ‘‘నమితతో ఎవరూ అమర్యాదకరంగా వ్యవహరించలేదు. ఆలయ నియమాల ప్రకారమే ఆమెతో మాట్లాడాం. పై అధికారులు చెప్పడంతో కొంత సమయం ఆగమని చెప్పాం. కొంతసేపటి తర్వాత ఆమెను దేవాలయంలోకి  అనుమతించాం’’ అని తెలిపారు.

Updated Date - Aug 26 , 2024 | 05:16 PM